Sp Sailaja : ఎస్పీ బాలసుబ్రమణ్యం కి అవార్డు రావడం పట్ల స్పందించిన ఎస్ పి శైలజ..!!
Sp Sailaja : ఇటీవల కేంద్ర ప్రభుత్వం గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకుముందే పద్మశ్రీ మరియు పద్మభూషణ్ అవార్డులను ఆయన అందుకోవడం జరిగింది. ఈ క్రమంలో దేశంలో రెండో అత్యుత్తమ పురస్కారాన్ని ఎస్పీ బాలు కి కేంద్రం ప్రకటించడంతో ఆయన చెల్లెలు ప్రముఖ గాయని ఎస్ పి శైలజ సంతోషం వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రకటన వచ్చిన సమయంలో అన్నయ్య లేకపోవడం చాలా బాధగా ఉందని చెప్పుకొచ్చారు. ఇలాంటి సంతోషకరమైన క్షణాలు అన్నయ్యతో కలిసి పంచుకోలేకపోవటం భగవంతుని నిర్ణయాన్ని కాదనలేక పోతున్నట్లు.. పని ఏదైనా మంచిని మాత్రమే గ్రహించాలని శైలజ పేర్కొన్నారు. అన్నయ్య ఈ అవార్డు రావడం పట్ల ఎంతోమంది అభిమానులు సంగీత ప్రియులు శుభాకాంక్షలు ఆశీస్సులు తెలిపారని వారందరికీ కృతజ్ఞతలు అంటూ ఎస్.పి.శైలజ పేర్కొన్నారు. అదేరీతిలో కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలిపారు.