తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు తెర లేపిన మాజీ టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసిపి ఎంట్రీ విషయం వెనుక చాలా పెద్ద కథ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన గంటా విశాఖలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలంగా విశాఖ జిల్లాలో మైనింగ్ వ్యవహారాల అవినీతి, అక్రమాలు మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేవలం విశాఖ అనే కాకుండా ఉత్తరాంధ్రలోని మైనింగ్ వ్యవహారాలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికే కీలక సామాజికవర్గం ఉంది. దశాబ్దాల కాలంగా ఈ వర్గం మైనింగ్ వ్యవహారాలను తమ గుప్పిట్లో పెట్టుకుని వేల కోట్లు అర్జిస్తోంది.
ఇక ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వ్యవహారాలకు గండిపడింది. దీనితో కొన్ని సంస్థలపై కోట్లకు కోట్లు పెనాల్టీలు పడ్డాయి. ఇప్పుడు గుక్కతిప్పుకోలేని సమస్యల్లో ఉన్న వారు తమకు అండగా ఉండేందుకు తమ వాడిని ఒకడిని అధికారపక్షం లోకి చేరిస్తే ఈ పరిస్థితి సద్దుమణుగుతుంది అని భావిస్తున్నారు. కనీసం మాట సాయం చేసే మనిషి కూడా లేకపోవడంతో ఇటువంటి లీడర్ ఆ పార్టీలో ఉంటే తమకు శ్రేయస్కరంగా ఉంటుంది అన్నది వారి భావన.
ఇకపోతే గంటా శ్రీనివాసరావు కి వివిధ వర్గాలతో అనేక వ్యాపార లావాదేవీలు ఉన్నాయన్నది రాజకీయ వర్గాల్లో తరచుగా వినిపిస్తూ ఉండే మాట. ఆయనకు ప్రత్యక్ష భాగస్వామ్యం లేకపోవచ్చు కానీ ఈ నెలలో జరిగిన విషయాలు మరియు జరుగుతున్న వాటికి కూడా ఆయన అండదండలు పూర్తిగా ఉంటాయి. అందుకే…. నాలుగేళ్ళు ప్రతిపక్షంలో ఉండి తన వాళ్లకు సహాయం చేయలేని స్థితిలో ఉండటం కన్నా వైకాపా లో కి వెళ్ళి ఎంతో కొంత సాయం అందించడం ద్వారా తర్వాత రాబోయే సమస్యల నుండి తనని తాను రక్షించుకోవడం ప్రస్తుతం గంట ముందు ఉన్న కర్తవ్యంగా తెలుస్తోంది.
అయితే ఇక్కడ విషయం ఏమిటంటే గంట పార్టీ మారినా…. అతని అనుచరగణం మొత్తం టిడిపిలోనే ఉండవచ్చు. ఇక ఇదంతా గమనించిన జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పార్టీలో గంటా ను చేర్చుకుంటేనే సదరు వ్యక్తులు లాభపడతారు లేదంటే వారితో పాటు గంటా కూడా భవిష్యత్తులో ఇబ్బంది పడవలసి వస్తుంది అని రాజకీయ విశ్లేషకుల పరిశీలన.