Sri Lanka: శ్రీలంక మాజీ క్రికెటర్ జయసూర్యకు అందరికీ సుపరిచితుడే. శ్రీలంక క్రికెట్ టీమ్ లో ఓపెనర్ బ్యాట్స్మెన్ గా.. ఎడమ చేతి వాటం కలిగిన జయసూర్య… ఇంటర్నేషనల్ క్రికెట్ పరంగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ దక్కించుకున్నాడు. బ్యాటింగ్ లో మాత్రమే కాదు… బౌలింగ్ పరంగా ఇంకా ఫీలింగ్ పరంగా కూడా జయసూర్య శ్రీలంక క్రికెట్ చరిత్రలో తనకంటూ పేజీలు క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం రిటైర్మెంట్ ఇచ్చిన జయసూర్య తాజాగా… ఇండియా దేశానికి థాంక్స్ చెప్పాడు. విషయంలోకి వెళితే శ్రీలంక ఇప్పుడు కరువుతో.. ఆకలి కేకలతో.. ఆర్థిక ఇబ్బందులతో… అన్ని రకాలుగా నష్టపోయి ఉన్న సంగతి తెలిసిందే.
చైనా దేశం వద్ద భారీ ఎత్తున అప్పులు చేయడంతో పాటు.. రాజకీయ సంక్షోభంలో ఆహారం మరియు ఇంధన కొరత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కరోనా వైరస్ కారణంగా శ్రీలంక ఆర్థిక దివాలా తీసేసిన పరిస్థితి నెలకొంది. దీంతో శ్రీలంకలో దోపిడీలు స్టార్ట్ అయిపోయాయి ప్రజలు నిరసనకారులు ఎక్కడికక్కడ.. ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీలంక అధ్యక్షుడు శ్రీ రాజపక్సే ఇంటిని కూడా ముట్టడించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న శ్రీ లంక అని గట్టెక్కించడానికి భారత్ సాయం అందిస్తోంది. టన్నుల కొద్దీ బియ్యంతో పాటు కొన్ని ఆహార ధాన్యాలను భారత్-శ్రీలంక కి అందించింది.
అంతమాత్రమే కాదు 36 వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్ తో పాటు.. 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్ కూడా… భారత్ లంక దేశానికి అందించడం జరిగింది. ఈ విషయాన్ని శ్రీలంకలో భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. దీంతో ఎంత సాయం చేస్తున్నా భారత్ పట్ల ఆ దేశ మాజీ స్టార్ క్రికెటర్ జయసూర్య… పెద్దన్న తరహాలో శ్రీలంకకు సాయం చేసినందుకు ఇండియాకి కృతజ్ఞతలు అని తెలియజేశారు. ఆ పరుగు దేశం భారత్ ఎల్లప్పుడూ మా వెన్నంటే ఉంటుంది. భారత ప్రభుత్వానికి మరియు ప్రధాని మోడీ కి రుణపడి ఉంటాం. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న పరిస్థితులు బట్టి కోలుకోవటం… అంత సులువైన పని కాదు. ఇండియా లాంటి మరికొన్ని దేశాలు సాయం అందించడానికి ముందుకు వస్తే ఈ సంక్షోభం నుండి శ్రీలంక బయటపడుతోంది అన్ని సోషల్ మీడియా వేదికగా… జయసూర్య విజ్ఞప్తి చేశారు.