శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ కి తన రెండవ సినిమాతోనే అతి పెద్ద షాక్ తగిలింది. కమర్షియల్ రీమేక్ అయిన తన మొదటి చిత్రం ‘ధడక్’ తో సక్సెస్ అందుకున్న జాన్వి.. తన నటనకు పర్వాలేదు అన్నట్లుగా మార్కులు దక్కించుకుంది. ఆ తర్వాత ‘గోస్ట్ స్టోరీస్’ అనే ఒక వెబ్ సిరీస్ లో ఆమె నటించింది. అందులో కూడా నటిగా మంచి మార్కులే తెచ్చుకుంది. అయితే తాజాగా ‘గుంజన్ సక్సేనా’ సినిమాలో నటించిన జాన్వి మాత్రం ఇప్పుడు తన నిర్ణయానికి పశ్చాత్తాప పడుతోంది.
కార్గిల్ యుద్ధ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సేవలందించిన ‘గుంజన్ సక్సేనా’ బయోపిక్ లో జాన్వీకపూర్ ప్రధాన పాత్రలు పోషించింది. ఈ మధ్యకాలంలో బయోపిక్ లకు పెరిగిన ఆదరణ దృష్ట్యా కరణ్ జోహార్ ఈ బయోపిక్ ను జాన్వి చేత చేయించాడు. అయితే ఈ సినిమాతో ఆమె స్థాయి పెరుగుతుందని అందరూ భావించారు. కానీ ఆమె మాత్రం తనపై తలకు మించిన భారం పెట్టడంతో చివరికి బాగా ఇబ్బంది పడినట్లు అయింది.
భారతదేశంలో మొట్టమొదటి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా..! అంతటి క్యారెక్టర్ కు యువ జాహ్నవి న్యాయం చేయలేకపోయింది అన్నది విమర్శకుల మాట. ఆమె ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందని ప్రేక్షకులు కూడా అనేశారు. కొద్దిమంది పర్వాలేదు అన్నా కూడా ఎక్కువ శాతం మంది పాత్రల్లో జాన్వి లో గుంజన్ ను చూడలేకపోయాం అన్నారు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అంటే చాలా ఫిట్ గా ఉండాలి.. కానీ జాన్వీలో ఏ మాత్రం ఆ లక్షణాలు లేవు.
కనీసం పదేళ్ల అనుభవం ఉన్నవారు కూడా ఇటువంటి పాత్రలు చేసేందుకు భయంకరమైన హోం వర్క్ చేస్తారు కానీ తన రెండవ సినిమా లోని ఇంతటి బాధ్యతలు ఆమె పై అదనపు భారం అని అందరూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీనితో జాన్వీకపూర్ కూడా అనవసరంగా తన కెరీర్ ను ఇరకాటంలో పడేసే సినిమా చేశానని బాధపడుతోందట,. ఊరుకో.. జాన్వి..! ఇలాంటివి ఎన్ని చూడకపోతే మీ తల్లి అంత స్థాయికి వస్తుంది…? నువ్వు కూడా ధైర్యంతో ముందడుగు వేయాలి మరి.