టీవీ నటి శ్రావణి ఆత్మహత్యకు సంబంధించిన కేసులో పోలీసులు ఆర్ఎక్స్100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డి ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని మీడియా ముందు నిర్మాత అశోక్ రెడ్డి వాపోయారు. తనను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారని ఆయన వాదించగా… అతను మొత్తం వివరించినప్పటికీ బయట వస్తున్న సమాచారం మాత్రం భిన్నంగా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆ కారణంతోనే అతడిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
అశోక్ రెడ్డికి 2017 లోనే శ్రావణ్ తో సంబంధం ఉందని ఆమెకు ఆర్ఎక్స్ 100 సినిమాలో అతిథి పాత్ర కూడా అందుకే ఇచ్చారని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. తర్వాత నిర్మాత అశోక్ రెడ్డి ఆమె ఆర్థిక సమస్యలను తీర్చడానికి కొంత డబ్బు ఇచ్చాడని తద్వారా ఆమెను శారీరకంగా మానసికంగా హింసించడం పోలీసుల విచారణలో తెలిసినట్లు సమాచారం బయటకు వచ్చింది. శ్రావణి ఆత్మహత్య చేసుకున్న రోజు అశోక్ ఆమె ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో పాటు ఆమెను కూడా హెచ్చరించినట్లు సమాచారం.
ఇదే సమయంలో ఇంటికి వచ్చిన సాయి రెడ్డి కూడా తన ప్రేమను నిరాకరించి దేవరాజ్ ను వివాహం చేసుకోకూడదని వేధించాడని పోలీసులు గుర్తు చేశారు. అయితే అశోక్ రెడ్డి మాత్రం శ్రావణి తన అదుపాజ్ఞల్లో పెట్టుకొని తన అనుమతి లేకుండా ఎవరినీ వివాహం చేసుకోకూడదని హెచ్చరించినట్లు తమ విచారణలో తెలిసిందట. ఇక అశోక్ రెడ్డి సాయి, రెడ్డి లతో శ్రావణికి సంబంధాలు ఉన్నాయని కూడా దేవరాజ్ ఆమె ని వివాహం నుండి దూరం ఆమె మానసిక క్షోభ భరించలేక చనిపోయిందని ఒక కొలిక్కి వచ్చారు.
మొత్తానికి ఈ కేసులో అశోక్ రెడ్డి వాదన అటువైపు బలంగా ఉన్నా… పోలీసులు మాత్రం వేరే కథ చెప్పడం అందరూ కన్ఫ్యూజన్ కు గురయ్యారు. ఈ కథ ఎక్కడికి వెళ్లి ఎలా ముగుస్తుందో చూడాలి..!