ఆంధ్ర ప్రదేశ్ : డాప్లర్ రాడార్ కేంద్రం (IMD) అధికారి ఉమా శంకర్ దాస్ మరో రెండు రోజుల్లో ఏపీకి తుఫాను (cyclone) ముప్పు ఉందని హెచ్చరించారు. ఇటీవల దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడడం జరిగింది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నంకి వాయుగుండంగా మారుతుందని తెలిపారు. ఇక ఆదివారం మే 8వ తారీకు కి తుఫాను గా బలం పుంజుకునే అవకాశం ఉందని.. ఆ తర్వాత మే 10 తారీకు ఉత్తర మరియు పశ్చిమ దిశగా ప్రయాణం చేస్తుందని.. పదవ తారీకు సాయంత్రానికి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం మరియు దక్షిణ ఒడిస్సా గోపాల్ పూర్ సరిహద్దులు దాటే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ కారణంగా పదవ తారీఖున పశ్చిమ బంగాళాఖాతానికి తీవ్రంగా గాలి తీవ్రత ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం సముద్ర ఉపరితలంలో 29 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని తుఫాను బలంగా మారే వాతావరణం ఏర్పడిందని దీనిపై అధ్యయనం జరుగుతోందని ఉమా శంకర్ తెలియజేశారు. దీంతో రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తా మరియు దక్షిణ ఒరిస్సా జిల్లాలలో.. వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పేర్కొన్నారు. సోమవారానికి తుఫానుగా మారే అవకాశం ఉందని ఒరిస్సా తీరప్రాంతాల్లో మేఘాలు అలుముకుంటాయి అని స్పష్టం చేశారు.
ఇంకా తీవ్రతరమై పదవ తారీకు గంజాం, ఖుర్దా, పూరీ, జగత్సింగ్పూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. దీంతో మే 9, 10 వ తారీకులలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం సముద్రంపై గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.. మరికొద్ది గంటల్లో తీవ్రత 50 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని ఉమా శంకర్ దాస్ పేర్కొన్నారు.