ఇంట్లో పిల్లులు, కుక్కలు పావురాలు ,కుందేళ్లు ఇలా పెపుడు జంతువులని చాలా మంది పెంచుకుంటారు. అయితే.. మన ఇంట్లో పిల్లి, పక్కింట్లోకి వెళ్లి పాలు, పెరుగులాంటివి తినడం లాంటివి చేస్తూ ఉంటాయి. అయితేఇక్కడ ఓ మహిళ పెంచుకున్న పిల్లి కూడా అలానే చేసిందట. కానీ ఆ పిల్లి పాలు, పెరుగులాంటివి కాకుండా..ఏకం గా ఓ వస్తువుని దొంగలించిందట.
దీంతో.. యజమానురాలు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అదేమిటో చదివేయండి. పెనస్లేవియా ప్ప్రాంతం లో నివాసముంటున్న బీజే రోజ్ అనే మహిళ ఓ పిల్లి ని పెంచుకుంటుంది. దాని పేరు జోర్దన్.సహజంగా పిల్లులు.. పాలు, చేపలు లాంటివి దొంగతనం చేస్తాయి. కానీ ఈ పిల్లికి మాత్రం షూస్ దొంగతనం చేయడం అలవాటు అంట.
ఆ పిల్లి.. మొదట్లో చనిపోయిన పక్షులు, ఎలుకలు, పాములు లాంటివితీసుకువచ్చి ఇంట్లో తినేదట. తర్వాత వాటిని తీసుకురావడం మానేసిన త తర్వాత కొద్ది రోజులకు వాళ్ల ఇంటి ముందు ఎవరిదో షూ కనపడిందట. ఎవరిదోలే అని ఆమె పట్టించుకోలేదంట. ఆ తర్వాత రోజు కో కొత్త రకం షూలు దర్శనమిస్తూ వచ్చాయట. ఇలా ఎవ్వరు చేస్తున్నారో తెలుసుకోవడానికి ఆమె సీసీ కెమేరా ఏర్పాటు చేసింది.
అందులో చూశాక ఆమెకి అర్థమయ్యిందంటా .. ఆ షూస్ దొంగ మరియెవ్వరో కాదు తన పిల్లి అని.అయితే.. రోజు రోజుకీ ఆమె ఇంటి వద్ద షూస్ పెరిగిపోతున్నాయట. దాదాపు 40 జతల షూస్ తీసుకువచ్చింది ఆ పిల్లి . దీంతో.. ఆమెకు తానేదో పెద్ద తప్పు చేసిన భావన కలిగిందంట. వెంటనే.. ఎవరి షూస్ వాళ్లకి ఇచ్చేయాలని అనుకుంది.
అందుకోసం.. ఓ ఫేస్ బుక్ గ్రూప్ ఒకటి ఆమె క్రియేట్ చేసింది. అందులో.. తమ పిల్లి ఎత్తుకువచ్చిన షూస్ ఫోటోలు తీసి అందులో పోస్టు చేయడం మొదలుపెట్టింది.ఇప్పుడు ఆ గ్రూప్ లో చాలా మంది చేరారట. ఆ షూస్ ని గుర్తుపట్టి చాలా మంది వాళ్ల షూస్ తీసుకువెళ్లిపోయారట. తమ పిల్లి జోర్దన్ కి ఫ్యాన్స్ కూడా పెరిగిపోయారని ఆమె చెప్పుకొచ్చింది .