మీరు ఎన్నో దొంగతనాలు విని ఉంటారు…. చూసి ఉంటారు కానీ ఇలాంటి ఒక దొంగతనం గురించి మాత్రం చాలా అరుదుగా వింటారు. ఒక దొంగ అ దొంగతనం చేసేందుకు అనువైన ఇంటిని గుర్తించిన తర్వాత ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా వెళ్లి ఉన్నదంతా దోచేస్తాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 60 సార్లు దొంగతనం చేశాడు. చివరికి పోలీసులకు చిక్కిన ఆ దొంగ చెప్పిన సమాచారం ప్రకారం తోడుదొంగని కూడా అరెస్టు చేశారు.
విశాఖ పోలీసులు జూలై 20న విశాలాక్షి నగర్ లోని ఆఎసై ఇల్లు, ఎయిర్పోర్ట్, అనకాపల్లి, కసింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల వరుస చోరీలు జరిగాయి. పోలీసుల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినపుడు ఓ వ్యక్తి ఒంటిపై నూలు పోగు లేకుండా ఇళ్లల్లోకి ప్రవేశించి దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు. అతడు గుంటూరు జిల్లా పొన్నూరు కు చెందిన పాత నేరస్థుడు కంచర్ల మోహన్ రావు అని పోలీసులు కనుగొన్నారు. తుని సమీపంలో తిరుగుతుండగా ఈనెల 11వ తేదీన అతను పోలీసు చేతికి చిక్కాడు. ఇక ఈ వరుస దొంగతనాలు అతనికి సహాయ పడిన అనకాపల్లి మండలం రామయ్యపేట వెంకుపాలెం సంతోష్ కుమార్ కూడా అదుపులోకి తీసుకున్నారు.
మోహన్ రావు అయితే చోరీకి వెళ్లి పట్టుబడిన తర్వాత కూడా తప్పించుకోవడం లో ఎక్స్పెక్ట్. అలా దొంగతనాలకి పోయిన మనిషి ఇంటిని గుర్తించిన తర్వాత అర్ధరాత్రి సమయంలో సంతోష్ కుమార్…. మోహన్ రావు ని బైక్ పైన తీసుకుని వెళ్లి ఆ ఇంటి వద్ద దింపుతాడు. తర్వాత తన ఒంటిపై దుస్తులన్నీ తీసేసి ఇంటి లోనికి ప్రవేశించి చోరీ చేస్తాడు. అప్పుడప్పుడు అండర్వేర్, చేతులకు గ్లౌజులు వేసుకొని లోపలికి వెళ్ళాడు. చాకచక్యంగా ఇంట్లోని వస్తువులను చోరీ చేసి బయటపడతాడు.
ఒకవేళ చోరీ చేసే సమయంలో ఎవరైనా చూసినా…. ముహ్ఖ్యంగా ఆడవారి చూసినా ఒంటి మీద నూలు పోగు లేని అతను వారిని భయపెడతాడు. అతను నగ్నంగా ఉండడం చూసి సైకోలా భావించి అతడి దగ్గరకు ఎవరు వెళ్ళరు అని అతని ఉద్దేశం. ఆ సమయంలో తప్పించుకోవచ్చని ప్లాన్ వేసుకున్నాడు కానీ చివరికి పోలీసులు అతనిని చాకచక్యంగా అరెస్టు చేశారు.