Not Wearing Mask: కరోనా మహమ్మారి విజృంభణతో నిషేధాజ్ఞలు అమలు అవుతున్న సంగతి తెలిసిందే.. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తప్పనిసరిగా మాస్ ధరించాలని ప్రభుత్వాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. అందులో భాగంగానే నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు కూడా వెనకాడడం లేదు పోలీసులు.. మాస్ పెట్టుకొని ఓ యూనివర్సిటీ స్టూడెంట్ ను తుపాకీతో పోలీసు కాల్చిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది..
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో ఇటీవల మాస్కు పెట్టుకొని ఓ యూనివర్సిటీ స్టూడెంట్ ను తుపాకీతో పోలీసు కాల్చాడు. ముందుగా ఆ విద్యార్థిని మాస్కు పెట్టుకోలేదని పోలీసు ప్రశ్నించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ విద్యార్థి తాను ప్రాజెక్టులో పనిలో నిమగ్నమైపోయానని తన జేబులోనే మాస్క్ ఉందని విద్యార్థి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడట. అయితే అతని నుంచి లంచం ఆశిస్తున్న పోలీసు ఈ వివాదం కారణంగా సహనం కోల్పోయి గన్ తో కాల్చి చంపారని ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. ఈ సంఘటన జరిగిన తరువాత నిందితుడు పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఆ సమయంలోనే నిందితుడితో ఉన్న మరో ఇద్దరు పోలీసులను అదుపులోకి తీసుకుని వారిని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.