Sudigalli Sudheer: బుల్లి తెరపై తిరుగులేని జంట యాంకర్ రష్మి, సుడిగాలి సుదీర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక విధంగా చెప్పాలంటే సుడిగాలి సుధీర్ కి ఇంత పెద్ద మొత్తంలో పాపులారిటీ రావడంలో యాంకర్ రష్మి ఒకరు అని చెప్పవచ్చు. జబర్దస్త్ స్టార్టింగ్ లో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు.. రకరకాల ప్రోమోలు.. ఇద్దరికీ మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. దీంతో వీరిద్దరికి ఏర్పడిన ఆ ఇమేజ్ నీ క్యాష్ చేసుకోవడానికి జబర్దస్త్ షోలో మాత్రమే కాదు.. రకరకాల షోలలో.. ఎంటర్టైన్మెంట్ మీడియా సంస్థలు..రష్మి, సుధీర్ కి అవకాశం కల్పించాయి. సోషల్ మీడియాలో కూడా వీరిద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వీళ్ళిద్దరి క్రేజ్ కారణంగా బుల్లితెరపై దాదాపు ఐదు సార్లు పెళ్లి అయినట్లు కొన్ని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ప్రసారం అయ్యాయి. ఇక వాస్తవ జీవితంలో..రష్మి, సుడిగాలి సుధీర్ మంచి ఫ్రెండ్స్. అయినా గాని సుడిగాలి సుధీర్ ని అభిమానించే చాలామంది.. ఈ జంటని అన్నా వదిన అని పిలుచుకుంటారు. ఈ పరిణామంతో సుడిగాలి సుదీర్ ఫ్యాన్స్ రష్మి సోషల్ మీడియాలో ఎటువంటి ఫోటో పెట్టినా… వైరల్ చేస్తూ ఉంటారు. తాజాగా రష్మి ఫోటో పెట్టడం తో సుదీర్ ఫ్యాన్స్ గట్టిగా టార్గెట్ చేశారు. మేటర్ లోకి వెళ్తే.. “కేజిఎఫ్ 2” లో హీరోయిన్ శ్రీనిధిశెట్టి లేహంగా వేసుకుని “మెహబూబా మే తెరి మెహబూబా” అనే సూపర్ డూపర్ హిట్ సాంగ్ ట్రాక్ తో యాంకర్ రష్మి ఇంస్టాగ్రామ్ లో రీల్ చేయడం మాత్రమే కాదు చాలా రోజుల తర్వాత నా భావాలకు తగిన రీల్ చేసినట్లు.. రాసుకొచ్చింది.
దీంతో ఆ పోస్ట్ పెట్టిన తర్వాత సుడిగాలి సుదీర్ ఫ్యాన్స్ రష్మి రీల్ నీ గట్టిగా టార్గెట్ చేస్తూ వైరల్ చేస్తూ… రకరకాల కామెంట్లు పెడుతున్నారు. వదిన వదిన అంటూ.. ఒక పక్క లైకులు మరోపక్క కామెంట్లతో రష్మి లేటెస్ట్ రీల్ నీ వైరల్ చేస్తూ ఉన్నారు. ఇదిలాఉంటే ఇటీవలే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి సుడిగాలి సుదీర్ తప్పుకోవడం తెలిసిందే. అయితే ఇదే టైములో “శ్రీదేవి డ్రామా కంపెనీ” లో సుడిగాలి సుదీర్ స్థానంలో రష్మి యాంకర్ గా అవడం జరిగింది.