ప్రస్తుతం పచ్చిమిర్చి అనగానే చాలామంది దూరంగా ఉంటారు. ఎందుకంటే పచ్చిమిర్చి ఘాటైన మంటను కలిగి ఉంటుంది. కానీ పచ్చిమిర్చి వల్ల ఆరోగ్య విషయంలో ఎలాంటి సమస్యలు రావని అంతేకాకుండా డయాబెటిస్ తో బాధపడే వారికి షుగర్ శాతం తగ్గిస్తుందని వైద్యు నిపుణులు తెలిపారు.
పురాతన కాలంలో పచ్చిమిర్చిని ఇష్టంగా తీసుకునేవారు. ఉదయాన్నే చద్దన్నంలో పెరుగు వేసుకొని పచ్చిమిర్చితో కలిపి తీసుకునేవారు. ఆరోగ్య సమస్యలు రాకుండా చూస్తుంది కాబట్టి పురాతన కాలంలో డయాబెటిస్ వ్యాధి వంటి సమస్యలు లేవు. కానీ ప్రస్తుతం ఆరోగ్యంలో ఎన్నో సమస్యలను చూస్తున్నాం కారణం మనం తీసుకునే ఆహార పదార్థాలలో మార్పులు.
ఎలాంటి కొవ్వు పదార్థాలు లేని పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల షుగర్ శాతం తగ్గించవచ్చు. దీనివల్ల డయాబెటిస్ తో బరువు ఉన్న వాళ్ళు బరువును తగ్గించుకోవచ్చు. రక్తంలో ఉన్న చక్కెర శాతం కూడా అదుపులో ఉంటుంది. పచ్చిమిర్చిలో విటమిన్ ఏ, విటమిన్ బి6, ఐరన్, పొటాషియం, ఫైబర్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు దరిచేరవు.
మిర్చి వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఏదైనా గాయమైనప్పుడు రక్తస్రావంను తగ్గిస్తుంది. పచ్చిమిర్చిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దగ్గు, జలుబు ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. పచ్చిమిర్చి లో ఉండే విటమిన్ సి, బీటా కెరోటిన్ మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించడమే కాకుండా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. చూశారుగా ఎన్ని లాభాలు ఉన్నాయో.. మరి ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే ఈ చిట్కాలు పాటించండి ఆరోగ్యంగా ఉండండి!