Sukumar: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకరు సుకుమార్. ఫస్ట్ సినిమా ఆర్యతో కెరీర్ స్టార్ట్ చేసిన సుక్కు వైవిద్యమైన కథలు చేస్తూ బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేసుకుంటూ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టిస్తూ ఉన్నాడు. “రంగస్థలం” సినిమా తో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులను పగలగొట్టిన సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుందట.
వాస్తవానికి ఈ సినిమా ఆగస్టు 13వ తారీకు రిలీజ్ చేయాలని భావించారు. కానీ కరోనా తీసుకొచ్చిన పరిస్థితి కారణంగా మొత్తం… ప్లాన్ మార్చేసి “పుష్ప 2″అనే సరికొత్త పార్ట్ తెరపైకి తెచ్చారు సుకుమార్. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలామంది పేషెంట్లకు రకరకాలుగా సహాయ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ తనకు జన్మనిచ్చిన కోనసీమ ప్రాంతానికి ఊపిరి పోయాడానికి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
మేటర్ లోకి వెళితే ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్ కోనసీమలో పాతిక లక్షలు పెట్టి ఏర్పాటు చేయాలని.. సుకుమార్ డిసైడ్ అయ్యాడట. ఇందుకోసం ఇప్పటికే సుకుమార్ సన్నిహితులు ప్రభుత్వం నుండి పర్మిషన్ మరియు స్థలం వెతకటం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కీలక టైంలో సొంత ఊరు ప్రజల ప్రాణాల కోసం సుకుమార్ ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఆజాద్ ఫౌండేషన్కు సుకుమార్ ఆక్సిజన్ సిలిండర్లు అందజేయడం జరిగింది. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సుకుమార్ తాజా గా రెడీ అవడం తో… ఆయన తీసుకున్న నిర్ణయంపై ప్రముఖులు అభినందిస్తున్నారు.