దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ -2020లో నేడు కీలక మ్యాచ్ జరగనున్నది. ఇప్పటికే ముంబయి జట్టు ప్లే ఆఫ్ చేరుకుంది. అలాగే, ఢిల్లీ, బెంగుళూరు జట్లు కూడా ప్లేఆఫ్ కు చేరిన సంగతి తెలిసిందే. అయితే, నాలుగో బెర్తు కోసం పోటీపడుతున్న హైదరాబాద్ జట్టు నేడు చావోరేవో మ్యాచ్ ఆడనుంది.
నేటి మ్యాచ్లో గెలిస్తేనే టోర్నిలో నిలుస్తుంది. లేకుంటే ఇంటిబాట పడుతుంది. నేరుగా కోల్కతా ప్లేఆఫ్ కు చేరుకుంటుంది. అయితే, నేడు ముంబయితో జరిగే కీలక మ్యాచ్లో హైదరాబాద్ జట్టు గెలవనున్నది. అవును నిజమే.. జోరుమీద ఉన్న హైదరాబాద్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నయని క్రికెట్ దిగ్గజ ఆటడాడు, వెస్టిండీస్ ప్లేయర్ బ్రియన్ లారా కీలక వ్యాఖ్యలు చేశారు.
నేటి మ్యాచ్లో హైదరాబాద్ జట్టు గెలిచి ప్లేఆఫ్కు చేరుకుంటుందని అన్నారు. హైదరాబాద్ జట్టు విజయం వెనుక.. జట్టు జోరుమీద ఉండటమే కాకుండా గత మ్యాచులతో పోలిస్తే… మెరుగైన ప్రదర్శనను కనబరచడమేనని లారా అన్నారు.
అలాగే, ఇప్పటికే ముంబయి జట్టు ప్లేఆఫ్ కు చేరిన క్రమంలోనే నేటి మ్యాచ్కోసం ఆడే జట్టులో కీలక మార్పులు తీసుకునే అవకాశముందని తెలిపాడు. దాని గెలుపు, ఓటమితో సంబంధం లేదు కాబట్టి.. సీనియర్లకు విశ్రాంతి నిచ్చి.. జూనియర్లతో బరిలోకి దిగే అవకాశముందన్నారు. ఇది హైదరాబాద్ జట్టుకు కలిసి వస్తుందని తెలిపారు. లారా మాటలు నిజం కావాలనీ, హైదరాబాద్ గెలిచి.. ప్లేఆఫ్కు చేరుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?