బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అతని ఆత్మహత్యకి సంబంధించిన కేసుపై మూడు ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఒకటేమో సిబిఐ. మరొకటి ఈడీ. ఇక మూడో సంస్థ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఆత్మహత్య కాదని…. అతనిని హత్య చేశారనే అభియోగాలను కూడా రోజురోజుకి రెట్టింపు అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సుశాంత్ కేసు ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య సిబిఐ చేతికి వెళ్ళిపోయింది. సిబిఐ వారు చాలా మందిని విచారిస్తున్నారు. వీరిలో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ ప్రియా చక్రవర్తి ని ప్రధాన నిందితురాలిగా పరిగణిస్తున్నారు. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుండి పదిహేను కోట్ల రూపాయలు రియా వాడుకుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో సిబిఐ వారు మరింత లోతుగా తవ్వగా సుశాంత్ కు, ఒక ప్రైవేట్ బ్యాంకు ప్రతినిధి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీక్ అయింది. అందులో తన ఆస్తికి, తన బ్యాంక్ అకౌంట్ కి నామిని ఎవరో తెలిసిపోయింది.
బ్యాంక్ ఖాతాదారులు వారి అకౌంట్ కి నామినీని ఏర్పాటు చేసుకోవాలి. నామినీ పేరు బ్యాంకు లోతెలియజేస్తే బ్యాంకు అధికారులు అతని తదనంతరం అకౌంట్ కి నామిని వారసులుగా చేస్తారు. ఇక ఆ బ్యాంకు ఖాతాదారులు మరణిస్తే నామినీ కి డబ్బులు కూడా వెళ్లిపోతాయి. కేవలం బ్యాంకు ఖాతా కాకుండా ఇతర ఆర్థిక అంశాలకు సంబంధించి కూడా నామినీని పెట్టే అవకాశం ఉంటుంది.
సుశాంత్ కూడా ఇలాగే తన బ్యాంక్ అకౌంట్ కు ఒక నామినీ ఉంచాడు. ఆమె పేరు ప్రియాంక సింగ్. ఆమె ఎవరో కాదు సుశాంత్ అక్క. మే నెలలో…. అంటే సుశాంత్ చనిపోవడానికి ఒక నెల ముందు ఈ వాట్సాప్ చాట్ జరిగింది. దీని ప్రకారం చూస్తే సుశాంత్ తన బ్యాంక్ అకౌంట్ తో పాటు ఇతర ఇన్వెస్ట్మెంట్ లకు, ఆస్తులకు కూడా ప్రియాంకనే నామినీగా పెట్టి ఉంటారని భావిస్తున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!