Taliban’s : గత ఏడాది ఆగస్టు మాసంలో ఆఫ్ఘనిస్తాన్ దేశం మొత్తాన్ని తాలిబాన్ లు ఆధీనం లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఇరవై సంవత్సరాలకు అధికారానికి దూరంగా ఉండటం జరిగింది. అప్పట్లో తాలిబాన్ సామ్రాజ్యాన్ని లేకుండా అమెరికా చేయడం జరిగింది. ఆఫ్గనిస్థాన్ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు.. ఆస్కారం లేకుండా ప్రపంచ పెద్దన్న అమెరికా.. తాలిబాన్ సామ్రాజ్యాన్ని కూల దూసింది. ఈ పరిణామంతో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో దాదాపు 20 సంవత్సరాల పాటు అక్కడి ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్యం ప్రభుత్వం మొన్నటివరకు పరిపాలించడం జరిగింది.
అయితే ఇంతలోనే తాలిబాన్ లు… మళ్లీ పుంజుకుని ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి.. గత ఏడాది ఆగస్టులో… స్వాధీనం చేసుకున్న తరుణంలో చాలామంది ఆఫ్ కాని ప్రజలు దేశం విడిచి పారిపోయారు. కారణం తాలిబాన్ లు అమలు చేసే షరియా చట్టాలు. ఈ తరుణంలో ఆ దేశంలో మహిళలు కూడా రోడ్డుపై రోదన పెడుతూ… తాలిబాన్ ల నుండి కాపాడాలని మీడియాలో గోలపెడుతూ మొన్నటివరకు కనిపించారు. దీంతో ప్రపంచ దేశాలు .. తాలిబాన్లు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతూ ఉన్న తరుణంలో ఇప్పుడు.. అక్కడ ఏర్పడిన తాలిబాన్ ప్రభుత్వం మీడియా ప్రతినిధులకి నరకం చూపించేస్తుంది అట.
దేశంలో ఎక్కడ మీడియా ప్రతినిధి కనబడిన వారి పట్ల…కఠినంగా తాలిబాన్ అధికార ప్రతినిధులు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా దేశంలో జరుగుతున్న విషయాలని షూట్ చేస్తూ… బయట ప్రపంచానికి చూపిస్తున్న మీడియా ఛానల్స్ ప్రతినిధులను టార్గెట్ చేసి.. దొరికితే రోడ్డుపైన వారికి శిక్ష విధిస్తున్నట్లు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్ లో .. మరోసారి తాలిబాన్ లు వ్యవహరిస్తున్న తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.