మీరా మిథున్ తెలుసా మీకు? తమిళ నటి. ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఆ మీరానే ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. ఏకంగా వీడియోనే పెట్టింది. ఇంతకీ ఏంటా కథ.. పదండి ఓసారి..
ఇదివరకు ఓసారి కూడా మీరా మిథున్.. తమిళ్ హీరోలు సూర్య, విజయ్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేసింది. సూర్య, విజయ్ లాంటి టాప్ హీరోలపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? వాళ్ల ప్యాన్సే తనకు తగిన బుద్ధి చెప్పారు. దీంతో వెంటనే కిక్కుమనకుండా విమర్శలు చేయడం ఆపేసింది.
సరే.. సైలెంట్ గా ఉంది కదా అని అంతా అనుకుంటుండగా.. ఇప్పుడు మరో బాంబు పేల్చింది. హీరో విశాల్ ను టార్గెట్ చేసింది. హీరో విశాల్ కు తనంటే పిచ్చి అని… తనను పెళ్లి చేసుకోవాలని విశాల్ అనుకున్నాడని.. తను లేకపోతే చచ్చిపోతా.. అని కూడా విశాల్ బెదిరించాడంటూ మీరా చెప్పుకొచ్చింది.
నన్ను పెళ్లి చేసుకుంటా.. అని మూడేళ్లు తిరిగాడు విశాల్. మా అమ్మకు కూడా విశాల్ అంటే ఇష్టమే. కానీ.. నాకే డబ్బున్నోళ్లంటే ఇష్టం ఉండదు. డబ్బు ఉన్నవాళ్లను పెళ్లి చేసుకోకూడదని నేను ఫిక్స్ అయ్యా. అందుకే విశాల్ నా వెంట మూడేళ్లు తిరిగినా.. నేను మాత్రం ససేమిరా అన్నాను. పెళ్లికి ఒప్పుకోలేదు.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో మీరా వెల్లడించింది.
దీనికంటే ముందు కూడా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై మీరా వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. తాజాగా విశాల్ పై వ్యాఖ్యలు చేసింది. ఆ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి.. తనపై చేసిన వ్యాఖ్యలకు విశాల్ మాత్రం ఇంకా స్పందించలేదు. మరి.. ఆయన స్పందిస్తాడా? లేక సైలెంట్ గా ఉంటాడా? అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.