PK Vijay: తమిళ రాజకీయాలను ఎక్కువగా సినీ గ్లామర్ ఉన్న వ్యక్తులే ఏలుతారు అన్న సంగతి తెలిసిందే. ఎంజీఆర్, కరుణానిధి, జయ లలిత వంటి వాళ్లు ముఖ్యమంత్రులు కాగా విజయ్ కాంత్, కమల్ హాసన్ ప్రస్తుతం అరవ రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇదే సమయంలో మొన్న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో రజినీకాంత్ ఎంట్రీ ఇవ్వాలని చివరి వరకు ప్రయత్నాలు చేయక ఆఖరి క్షణంలో… రజిని తన నిర్ణయాన్ని మార్చుకోవడం తెలిసిందే.
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్.. ఇటీవల రాజకీయ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ పెట్టక పోయినా కానీ ఇటీవల స్థానిక ఎన్నికలలో తన అభిమానులను నిలబెట్టి.. పొలిటికల్ వార్తల్లో కీలకం గా నిలిచారు. కాగా ఇప్పుడు విజయ్ ఏకంగా రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో హైదరాబాద్ లో రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
అదేసమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ ఎదుర్కోవడంలో అన్నాడీఎంకే కి అంత సీన్ లేదని.. ఇటువంటి సమయంలో విజయ్ కొత్త పార్టీ పెడితే అందులో చేరటానికి అన్నాడీఎంకే పార్టీలు రెడీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అంత మాత్రమే కాక రజనీకాంత్ అభిమానులు కూడా విజయ్ పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నట్లు సార్వత్రిక ఎన్నికలకు ముందే విజయ్ కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్లు.. తమిళ రాజకీయాల్లో వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మళ్లీ 2026 ఎన్నికలలో గ్యారెంటీగా తమిళనాడులో విజయ్ పార్టీ నాయకత్వంలో మెగా కూటమి ఏర్పడే అవకాశం ఉందని.. తాజా వార్త పై తమిళ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.