గడిచిన 24 గంటల్లో తెలంగాణలో రికార్డు స్థాయిలో 872 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే. నిన్నటి నమోదైన కేసుల సంఖ్యతో పోలిస్తే దాదాపు రెట్టింపు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,674కు పెరిగింది.
గడిచిన 24 గంటల సమయంలో 3,189 మందికి టెస్టులు చేయగా.. వారిలో కరోనా పాజిటివ్గా ఈ 872 మంది బయటపడ్డారు. ఈ రోజు కరోనా వల్ల మరో 7 మరణాలు సంభవించగా మొత్తం మరణాల సంఖ్య 217కు పెరిగింది.
అయితే కొత్త కేసులు భారీగా నమోదవుతున్నా, రికవరీ రేటు ఎక్కువగా ఉండటం ఊరటకలిగిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 274 మంది వ్యాధి నుంచి కోలుకున్నట్లు బులిటెన్ లో తెలిపారు.
తద్వారా ఇప్పటిదాకా డిశ్చార్జి అయినవాళ్ల సంఖ్య 4005కి పెరిగింది. గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 713 కేసులు ఉండటం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో 107, మేడ్చల్లో 16 కొత్త కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డిలో 12, మంచిర్యాలతో 5, వరంగల్ రూరల్ జిల్లాలో 6, కామారెడ్డిలో 3, మెదక్ జిల్లాలో 3, జనగాంలో 2, కరీంనగర్లో 2, మహబూబాబాద్లో 2 కేసులు నమోదయ్యాయి.