టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నోటీసులపై తెలంగా హైకోర్టు లో బుధవారం విచారణ చేపట్టింది. బీఎల్ సంతోష్ కు ఈ నెల 16 నుండి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించామని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. చివరకు ఢిల్లీ పోలీసుల సాయంతో బీజేపీ ఆపీసులో నోటీసులు అందించినట్లు వివరించారు. బీఎల్ సంతోష్ సిట్ ముందుకు వస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయని ఏజి కోర్టుకు తెలిపారు. సిట్ విచారణ పారదర్శకంగా జరుగుతోందని వివరించారు. విచారణకు హజరుకాని తుషార్, జగ్గుస్వామిలకు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలిపారు. విచారణకు సంతోష్ రాకపోతే సాక్ష్యాలు తారుమారు అవ్వొచ్చని ఏజీ అనుమానం వ్యక్తం చేశారు. సిట్ ముందు బీఎల్ సంతోష్ హజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని ఏజీ న్యాయస్థానాన్ని కోరారు.
మరో వైపు బీఎల్ సంతోష్ చట్టాన్ని ఎక్కడా దిక్కరించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది రామచంద్రరావు ధర్మాసనానికి తెలిపారు. సంతోష్ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని న్యాయవాది రామచంద్రరావు తెలియజేయగా, రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదని సిట్ తరఫున ఏజి వాదనలు వినిపించారు. సిట్ విచారణకు సంతోష్ భయపడటం లేదని న్యాయవాది రామచంద్రరావు తెలిపారు. ఈ క్రమంలో బీఎల్ సంతోష్ 41 సీఆర్పీసీ నోటీసులను సవాల్ చేయాలనుకుంటున్నారా.. ? సిట్ ముందు హజరుకావడానికి సంతోష్ గడువు కోరుతున్నారా..? అని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి పిటిషనర్ తరపు న్యాయవాది బదులు ఇస్తూ.. బీఎల్ సంతోష్ సిట్ కు లేఖ రాశారని తెలిపారు. విచారణకు ఎందుకు హజరు కాలేకపోతున్నారో లేఖలో పేర్కొన్నారని వివరించారు.
దీనిపై సిట్ తరపు ఏజి ..బీఎల్ సంతోష్ తనకు ఇష్టమొచ్చినప్పుడు విచారణకు వస్తే కేసు తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సుప్రీం కోర్టు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని అడిగింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇంకా అప్ లోడ్ కాలేదని ఏజీ సమాధానం ఇచ్చారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులు చూసిన తర్వాతనే విచారణ జరుపుతామని హైకోర్టు వెల్లడించి.. తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. అయితే సాయంత్రానికి సుప్రీం కోర్టు ఉత్తర్వులు రావచ్చని న్యాయవాదులు భావిస్తున్నారు.
Breaking: మంత్రి మల్లారెడ్డి కుమారుడికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు