Schools Reopen: కరోనా వైరస్ తగ్గడంతో విద్యాసంస్థల ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సెప్టెంబరు ఒకటి నుంచి అన్ని రకాల విద్యా సంస్థలలో ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి ఉన్నతాధికారులతో జరిపిన సమావేశం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నారు..
కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గటంతో అన్ని రాష్ట్రాల విద్యా సంస్థలు ప్రారంభం పై దృష్టి సారించాయి.. ఇప్పటికే పలు రాష్ట్రాలు కరోనా నిబంధనలను పాటిస్తూనే విద్యాసంస్థలు తెరిచాయి. ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ నెల 16 నుంచి విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలు తెరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. కరోనా మహమ్మారి కారణంగా వార్షిక పరీక్షలు జరగకపోవడం, విద్యార్థులకు పాస్ మార్కులు వేయడం వంటి అంశాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.