Sonu Sood: భారతీయుల ఆపద్బాంధవుడు నటుడు సోనుసూద్.. గత ఏడాది లాక్ డౌన్ టైం నుండి అనేక సహాయ సహకార కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రభుత్వం ఒక్కసారిగా విధించడంతో ఆ సమయంలో వలస కూలీలని ఆదుకుని… వాళ్ల కోసం తన సొంత డబ్బులతో స్పెషల్ ట్రైన్లు, బస్సులు, విమానాలు ఏర్పాటు చేసి వాళ్లను గమ్యస్థానాలకు చేర్చడం జరిగింది. అప్పటి నుండి దేశవ్యాప్తంగా పేదవాళ్లకు ఇంకా అదే రీతిలో రకరకాల సహాయం కోసం అభ్యర్థించే వారికి తన దృష్టికి వచ్చే ప్రతి సమస్యలపై స్పందిస్తూ సోనూసూద్ ఆదుకుంటున్నారు.
కాగా ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో… అనేక మంది ప్రాణాలను కాపాడే రీతిలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ వైద్యపరంగా సహాయం చేస్తూ వస్తున్నారు. కీలక సమయంలో ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా.. పేదవారిని.. ఇంకా అనేకమందిని ఆదుకుంటూ నిజమైన రియల్ హీరో అనిపించుకున్నాడు. అటువంటి సోనుసూద్ తాజాగా తెలుగు యాంకర్ వింధ్య పై ప్రశంసల వర్షం కురిపించరు.
Read More: Sonu Sood: స్పెషల్ టీం టోల్ ఫ్రీ నెంబర్ లతో.. సోనూసూద్ సేవలు..!!
మేటర్ లోకి వెళ్తే సోను సూద్ ట్రస్ట్ కి ఈ తెలుగు యాంకర్ తన కాస్ట్యూమ్స్ మొత్తం వేలం వేసి వచ్చిన విరాళాన్ని మొత్తాన్ని… ట్రస్ట్ కి పంపించడం జరిగింది. దీంతో తాను చేస్తున్న పోరాటంలో యాంకర్ వింద్య కూడా అండగా నిలుస్తూ తనవంతుగా ముందుకు రావడంతో సోనూసూద్ ప్రత్యేకంగా ఆమె కోసం వీడియో రూపంలో సందేశాన్ని పంపి ఆమెకు థాంక్స్ చెప్పారు. ఇచ్చిన ప్రతి విరాళం అవసరమైన వారి ముఖాల్లో సంతోషం కలిగించే రీతిలో ఉపయోగిస్తున్నట్లు సోను సూద్ స్పష్టం చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?