ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. A – ఆదిపురుష్ సినిమా గురించి. సినీ అభిమానులే కాదు.. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. దేశమంతా ఈ సినిమా గురించి ఇప్పుడు చర్చిస్తున్నది.
ప్రభాస్ సడెన్ గా తన డైరెక్ట్ బాలీవుడ్ సినిమాను ప్రకటించడంతో ప్రభాస్ అభిమానులంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. కథ కూడా మామూలు గీమూలుగా కాకుండా.. రామాయణం ఇతిహాసాన్ని బేస్ చేసుకొని తీస్తుండటం.. అందులో ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తుండటంతో ఈ సినిమా పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోబోతోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు బహిర్గతం అయ్యాయి. వందల కోట్ల బడ్జెట్, విలన్ రోల్ కోసం బాలీవుడ్ పెద్ద నటుడు, పాన్ ఇండియా మూవీ.. అంటూ వార్తలు వచ్చినా.. సినిమాకు సంబంధించిన అసలు విషయాలను ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు రివీల్ చేసేశారు.
విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటే ఆదిపురుష్. అయితే ఈ సినిమాలో ఒకటే అవతారం ఉంటుందా. లేక దశ అవతారాలు ఉంటాయా? అనేది తెలియాలంటే మాత్రం మీరు ఫస్ట్ లుక్ వచ్చేవరకు ఆగాలి. అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. ఇటీవలే మన దేశ ప్రధాని అయోధ్యలో రామమందిరానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రామమందిరం గురించే చర్చ నడుస్తోంది. ఈసమయంలో ఈ సినిమాను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కథ కూడా రాముడికి సంబంధించిందే. రామాయణానికి సంబంధించిందే. ఈ సినిమా కథ నేను విన్నాను. చాలా నచ్చింది. ఈ సినిమాతో ప్రభాస్ హాలీవుడ్ స్టార్ కాబోతున్నాడు. ఈ సినిమాకు కనీసం 1000 కోట్ల బడ్జెట్ ను ఫిక్స్ చేశాం.. అంటూ కృష్ణంరాజు ఫ్రభాస్ ఫ్యాన్స్ కు హ్యాపీ న్యూస్ అందించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే… ఇక ఈ సినిమాతో ప్రభాస్ నా చిరకాల వాంచను కూడా నెరవేర్చబోతున్నాడు. నాకు బ్లవరీ హిల్స్ లో ప్రభాస్ తో కలిసి భోజనం చేయాలనే కోరిక ఉంది. ఆ కోరిక కలగానే మిగిలిపోకూడదని అనుకున్నా. నీతో కలిసి బ్లవరీ హిల్స్ లో భోంచేయాలనే కోరిక ఉందని.. దాన్ని ఎలాగైనా నువ్వు నెరవేర్చాలని ప్రభాస్ ను నేను కోరాను. దానికి ప్రభాస్ కూడా ఒప్పుకున్నాడు. బ్లవరీ హిల్స్ లో హాలీవుడ్ స్టార్స్ కు మాత్రమే ప్రవేశం ఉంటుంది.. మిగితా వాళ్లను ఆ హిల్స్ లో అడుగు పెట్టనీయరు. ఈ సినిమాతో ప్రభాస్ హాలీవుడ్ స్టార్ అయిపోతాడు.. బ్లవరీ హిల్స్ లో ప్రభాస్ కు సపరేట్ గా ఓ బిల్డింగ్ కూడా ఉండాలన్నదే నా ఆశ.. అంటూ చెప్పుకొచ్చారు కృష్టంరాజు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?