Stock Market: దాదాపు నాలుగు రోజుల నుండి స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. దేశంలో ఆర్బీఐ, ద్రవ్యోల్బణం.. పెరుగుదల, యూఎస్ ఫెడరల్ వడ్డీరేట్ల పెంపు, విదేశీ పెట్టుబడిదారుల నగదు ఉపసంహరణ దెబ్బకి స్టాక్ మార్కెట్ లు నష్టాలు దిశగా కొనసాగుతున్నాయి. ఈ పరిణామంతో పెట్టుబడిదారులు ఈక్విటీ లో కాకుండా బంగారం వంటి సురక్షితమైన పెట్టుబడి మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఎల్&టీ, బజాజ్ ఫిన్ సేర్వ, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, మారుతి బుధవారం నాటికి భారీగా పతనమయ్యాయి. ఇదే సమయంలో ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్.డిఎఫ్.సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ లాభ పడటం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గత నాలుగు రోజుల్లో BSE లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ ₹13.32 లక్షల కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఫారన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నికర ₹3,960.59 కోట్ల విలువైన షేర్లను ఆఫ్ లోడ్ చేయడం జరిగింది. స్టాక్ మార్కెట్ షేర్లు ఈ దిశగా పతనం ఇది మొదటిసారి కాదు. ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైందో ఫిబ్రవరి మాసం నుండి.. స్టాక్ మార్కెట్ పతనం దిశగా కొనసాగుతోంది. క్రిప్టో మార్కెట్, నిఫ్టీ కూడా.. నష్టం గుండా కొనసాగుతోంది. మరి ఇటువంటి తరుణంలో… స్టార్ మార్కెట్ పెట్టుబడిదారులు SIP.., డిప్ లిక్విడిటీ.. మరి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు తెలియజేస్తున్నారు.