మెగాస్టార్ చిరంజీవి హీరోగా సందేశాత్మక దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’ ఈ చిత్రం పైన మెగా అభిమానులు అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. టైటిల్ రివీల్ చేసే పోస్టర్ తోనే అభిమానులందరినీ ఆకట్టుకున్నాడు చిరంజీవి. ఇక చిరంజీవి వీలైనంత త్వరగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు.
కొనసాగుతున్న షెడ్యూల్ త్వరలోనే పూర్తవుతుంది అలాగే తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్లో కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆచార్య కోసం రూపొందించిన షెడ్యూల్ చాలా పెద్దది అని… అలాగే దాని కోసం భారీ సెట్ను ఏర్పాటు చేస్తున్నారు.. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ ఆ సెట్ నిర్మాణ ప్రక్రియను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన సెట్ కోసమే మేకర్స్ రూ .4 కోట్లకు దగ్గరగా ఖర్చు చేస్తున్నారు.
హైదరాబాద్ లోని కోతాపేట వద్ద నిర్మిస్తున్న ఈ భారీ సెట్లో బహుళ దేవాలయాలు రూపకల్పన చేయబడుతున్నాయి. సినిమా మిగిలిన భాగంలో ఎక్కువ భాగం ఈ సెట్లో చిత్రీకరించబడుతుంది అని అంటున్నారు. చిత్ర బృందం కఠినమైన భద్రతా చర్యలు, ఆరోగ్య జాగ్రత్తలను అనుసరిస్తోంది ఇక ఈ సెట్లో చిత్రానికి అవసరమైన అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆచార్య షూట్ వచ్చే ఏడాది ఆరంభంలో ముగుస్తుంది,,, ఇక ఈ చిత్రం 2021 చివరి భాగంలో ప్రేక్షకుల ముందుకు రావచ్చు. ఇంతకు ముందు ఈ చిత్రం ఒక పెద్ద వివాదంలో ఇరుక్కొన్న విషయం కూడా తెలిసిందే. ఒక రచయిత ఆచార్య కథను కొరటాల శివ తన దగ్గర నుండి కాపీ కొట్టాడు అని కేసులు వేశాడు. ఈ విషయంపై చిరంజీవి స్పందించలేదు కానీ ఫిలిం ఛాంబర్ సరిగ్గా హ్యాండిల్ చేయడంతో అతను మీడియా ముందుకు వెళ్ళాడు.
చివరికి ఇప్పుడు పరిస్థితి సద్దుమణిగింది. ఎన్నో ఆటంకాలు మధ్య కొనసాగుతున్న ఆచార్య చిత్రం అనుకున్న సమయానికి విడుదల అయితే మెగా అభిమానులకు అంతకుమించి ఇంకొక పండుగ ఉండదు. సైరా పర్వాలేదనింపించిన తర్వాత చిరంజీవిని మళ్ళీ కంప్లీట్ మాస్ అవతార్ లో చూసే అవకాశం కోసం ప్రేక్షకులంతా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.