బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. వీకెండ్ కావడంతో హౌస్ నుండి ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండటంతో సోషల్ మీడియాలో తెగ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ తరుణంలో రక్షకుల ఓటింగ్ ప్రకారం అభిజిత్ కి ఎక్కువ ఓట్లు పడటంతో మొదటి స్థానంలో ఉన్నట్లు టాక్. ఆ తరువాత అఖిల్, లాస్య, నోయల్… సేఫ్ జోన్ లో ఉంటూ బాగా ఓట్లను రాబడుతున్నారట.
అదేవిధంగా ఆరియానా కి కూడా ప్రేక్షకుల సపోర్ట్ మొదటిలో కన్నా ఇప్పుడు బాగా పెరిగినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే డేంజర్ జోన్ లో అమ్మ రాజశేఖర్, సుజాత ఉన్నట్లు టాక్. శాపనార్థాలు పెడుతూ హౌస్ కే పెద్ద నసగా ఉండటంతో ఎలాగైనా అమ్మ రాజశేఖర్ ని పంపించేయాలని బయట జనాలు అనుకుంటున్నారట.
ఇందువల్ల ఈ సారి ఆయనకు తక్కువ ఓట్లు పడ్డాయని టాక్. అదేవిధంగా సుజాత కూడా ప్రతిదానికి నవ్వటం తో పాటు…. కారణం లేని చోట కూడా నవ్వుతూ నటించే తరహాలో ఉండటంతో ఆమెను కూడా బయటకు పంపించడానికి ప్రేక్షకులు డిసైడ్ అయినట్లు, దీంతో వీళ్ళిద్దరిలో హౌస్ లో సోమవారం నుండి ఒకరు కనబడరు… అని ఫుల్ గా సోషల్ మీడియాలో డిస్కషన్ లు జరుగుతున్నాయి. ముఖ్యంగా నాగార్జున ని గౌరవం లేకుండా సుజాత పిలవడం పట్ల బయట జనాలు ఆమె తీరుపై మంచి గుర్రుగా ఉన్నారు.