దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా క్రమంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంబరాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర పెద్దలు దేశవ్యాప్తంగా ఉన్న పౌరులు ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని పిలుపునివ్వడం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని రీతిలో చాలామంది పౌరులు జాతీయ జెండాని తమ ఇళ్లపై ఇంకా వాహనాలపై ఎగరేస్తున్నారు. ఈ సందర్బంగా జాతీయ జెండా ఎగరవేసే విషయంలో కొత్త నిబంధనలు కేంద్రం అందుబాటులోకి తీసుకురావడం తెలిసిందే. జాతీయ జెండాన్ని పగలు, రాత్రి కూడా ఎగరేయొచ్చంటూ నిబంధనలు సవరించారు.
ఇదే సమయంలో ఎగరవేసే జాతీయ జెండా చిన్నదైనా లేదా పెద్దదైనా పొడవు, ఎత్తు(వెడల్పు) నిష్పత్తి 3.2 ఉండాలి. జెండా దీర్ఘచతురస్రం లోనే ఉండాలి. చిరిగిపోయిన అదే విధంగా నలిగిపోయిన జాతీయ జెండాని ఎట్టి పరిస్థితుల్లో ఎగరవేయకూడదు. జాతీయ జెండా ఎత్తైన ప్రదేశంలో ఉండాలి. ఎగరవేసే జాతీయ జెండా పక్కన ఎటువంటి వస్తువులు మరే ఇతర జాతీయ జెండాలు ఉండకూడదు. జాతీయ జెండా ఎగరవేసే స్తంభాలపై ఇటువంటి వాణిజ్య ప్రకటనలు ఉండకూడదు. జెండాని నీళ్లలో లేదా నేలపై పడవేయకూడదు.
మరి ముఖ్యంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్.. ఇతర రాజ్యాంగ బద్ధ పదవులలో ఉన్న వారి వాహనాల పైన మాత్రమే జెండా ఉంటుంది. సొంత వాహనాలపై జాతీయ జెండాని వాడకూడదు. జాతీయ జెండా ని మాటల ద్వారా లేదా లేదంటే చేతల ద్వారా అగౌరవపరిస్తే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971లోని సెక్షన్ 2 కింద మూడుఏళ్లు వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధిస్తారు. 75 సంవత్సరాలు స్వాతంత్ర పురస్కార నేపథ్యంలో జాతీయ జెండా ఎగరవేస్తున్న ప్రతి ఒక్కరు.. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎగరవేయండి. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జైహింద్.