టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని స్వాతంత్ర దినోత్సవం రోజున అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అంతా షాక్ కు గురయ్యారు. సీనియర్ క్రికెటర్లు, దిగ్గజాలు అందరూ అతని రాబోయే రోజులు మరింత సాఫీగా సాగాలని మనస్పూర్తిగా కోరుకున్నారు.
అయితే క్రికెట్ అభిమానులు ధోనీ లేని ఆటను ఊహించుకోలేకున్నారు. ఇదే సమయంలో టీం ఇండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ధోని రిటైర్ అయిపోయాడు అని బాధ పడుతున్న వారందరికీ గుడ్ న్యూస్ చెప్పాడు. టీమిండియా బ్యాట్స్మెన్ రోహిత్ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ పురస్కారం ఇప్పటివరకు టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్లు గా సేవలందించిన సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ లకు మాత్రమే దక్కింది. వారి తర్వాత ఈ అత్యున్నత పురస్కారాన్ని సొంతం చేసుకుంటున్న నాలుగవ క్రికెటర్ రోహిత్.
అయితే ఇప్పటి వరకు ఎవరూ సాధించని ఘనత ఒకటి రోహిత్ సాధించాడు. ధోనీ, కోహ్లీ, సచిన్ ఈ పురస్కారం అందుకునే సమయానికి పూర్తిస్థాయి కెప్టెన్లుగా వ్యవహరించారు. కాని రోహిత్ మాత్రం ఇంకా పూర్తి స్థాయి కెప్టెన్ గా వ్యవహరించకుండానే దీనిని అందుకోనున్న తొలి క్రికెటర్ గా ఘనత సాధించాడు. కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహించాడు…. అది కూడా 2018 ఏషియా కప్ టోర్నమెంట్లో.
ఇకపోతే ఐపీఎల్ లో ధోని అన్ని సంవత్సరాలు కెప్టెన్సీ చేసి చెన్నై సూపర్ కింగ్స్ కు మూడు టైటిల్స్ అందిస్తే రోహిత్ శర్మ మాత్రం అతనికన్నా తక్కువ సార్లు కెప్టెన్ గా వ్యవహరించి ఇప్పటికే ముంబైకి నాలుగు టైటిల్స్ అందించాడు. ఇక ధోని లేని లోటుని టీమిండియాకు నేను తీరుస్తా అన్నట్లు రోహిత్ ఈ ఖేల్రత్న పురస్కారం ద్వారా ప్రకటించినట్లు అయింది. ధోని ని మంచి కెప్టెన్ గా, ఆటగాడిగా అందరు రోహిత్ లో చూసుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.