India China Boarder: భారత్-చైనా సరిహద్దుల మధ్య ఓ మహిళ నేనే పార్వతిని… శివుని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ వచ్చా అంటూ రచ్చ రచ్చ చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నోకు చెందిన హర్మిందర్ కౌర్ అనే మహిళ భారత్-చైనా సరిహద్దు మధ్య.. ఉత్తరాఖండ్ లోని గుంజి అనే ప్రాంతంలో 15 రోజులు గడపటానికి అధికారుల వద్ద అనుమతి తీసుకోవటం జరిగింది. ఈ క్రమంలో గడువు ముగిసి రావటానికి నిరాకరించటం మాత్రమే కాకుండా నేనే పార్వతీదేవి అవతారాం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కైలాసం పర్వతంలో శివుడు ఉన్నాడు. ఆయన్ని పెళ్లి చేసుకుంటా. నన్ను బలవంతంగా తీసుకెళ్లాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని… సదరు మహిళ అధికారులకు చుక్కలు చూపించింది. దీంతో సదరు మహిళ ని బయటకు తీసుకు రావడానికి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. శివుని పెళ్లి చేసుకుంటే గాని బయటకు వచ్చే ప్రసక్తే ఉండదని ఆ మహిళ కరాఖండిగా చెబుతుంది. కానీ ఆమె ఉంటుంది ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలోని నాభిధాంగ్లోని నిషేధిత ప్రాంతం.
దీంతో పోలీసులు ఆమెను ఎలాగైనా బయటకు తీసుకురావటానికి నానా తంటాలు పడుతున్నారు. మొదటిసారి ప్రయత్నం చేసిన సమయంలో ఆత్మహత్య చేసుకుంటానని తెలపటంతో.. వేనుదిరిగిన పోలీసు బృందం ఈ సారి పెద్ద బలగాలు తీసుకెళ్లి…హర్మిందర్ కౌర్ అనే మహిళనీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంది. పితోర్గఢ్ ఎస్పీ లోకేంద్ర సింగ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ ఆమెను సురక్షితంగా నైనా ఎలాగైనా బయటకు తీసుకు వస్తామని తాజాగా చెప్పుకొచ్చారు.