Today Gold Rate: పసిడి ప్రియులకు ఝలక్.. వరుసగా రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది.. పసిడి ధరలు పైపైకి కదిలాయి. ఈ రోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. పసిడి ధర ఆకాశాన్ని చూస్తోంది. బంగారం ధర భగ్గుమంటోంది. నేడు బంగారం ధరలు తోపాటు వెండి కూడా పెరిగాయి.. నేటి రేట్లు ఇలా ఉన్నాయి..
శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో చూసుకుంటే రూ.150 పెరిగింది. దీంతో ఈరోజు బంగారం ధర రూ. 44,700 కి చేరింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 పెరిగి రూ.49,950 కి ఎగసింది. ఈ 24 రోజుల్లో బంగారం ధర 14 సార్లు పెరిగింది.. 6సార్లు తగ్గింది.. నాలుగుసార్లు స్థిరంగా ఉంది అంటే ఎక్కువ శాతం బంగారం పెరుగుదల నమోదైంది. కాబట్టి రానున్న రోజుల్లో కూడా బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..
రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న వెండి ధర ఈరోజు కూడా అదే బాట పయనించింది.. దీంతో వరుసగా మూడో రోజు కూడా వెండి ధర లో పెరుగుదల నమోదయింది. నిన్నటి రేటు తో పోల్చుకుంటే ఏకంగా రూ.400 పెరిగింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.72,300 కి చేరింది. ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్ గా చెప్పవచ్చు. ఇన్వెస్టర్లకు ఇది గుడ్ న్యూస్.