Tollywood: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతూ ఉండటంతో పాటు మరోపక్క వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా చేస్తూ ఉండడంతో … దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ సడలింపులు .. కఠినతరం కాకుండా.. ప్రజలను వదిలేటట్టు చూసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజినెస్ చూస్తే గత ఏడాది మాత్రమే కాక ఈ ఏడాది దాదాపు ఆరు నెలలు మొదటి రెండు నెలలు తప్ప సినిమా థియేటర్ మొత్తం అయిపోయిన పరిస్థితి. అయినా కానీ భవిష్యత్తుపై మంచిదేనా గా ఇండస్ట్రీలో నిర్మాతలు టాప్ డైరెక్టర్లు అదేరీతిలో టాప్ హీరోలు ఉన్నట్లు ఓకే అవుతున్న ప్రాజెక్టులు బట్టి అర్థమవుతోంది.
ఇప్పటికే RRR, ఆచార్య ఇంకా చాలా సినిమాలు షూటింగ్ జరుపుకుని విడుదల అవ్వటానికి తుది దశకు చేరుకున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా.. నెక్స్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ఫైవ్ అతి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలు వాటి వివరాలు వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండింగ్ గా మారాయి. ఆ కాంబినేషన్ లిస్టు చూస్తే ఈ విధంగా ఉంది
Read More: Tollywood : మల్టీస్టారర్స్ మీద క్రేజ్ పెరుగుతోంది..బడ్జెట్ కూడా అంతే పెటాల్సి వస్తోంది..!
“కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో… ఎన్టీఆర్ సినిమా, సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా, మహానటి ఫిలిం డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమా, త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా… అదే రీతిలో కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా. ఈ ఐదు ప్రాజెక్టులకు సంబంధించి ఎటువంటి వార్త సోషల్ మీడియాలో వస్తున్న ఈ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. దీంతో సినిమా రిలీజ్ అయితే ఇంకా థియేటర్ల వద్ద పరిస్థితి ఎలా ఉంటుందో అని తాజాగా ఈ కాంబినేషన్ ల పై సోషల్ మీడియాలో సినీ ప్రేమికులు డిస్కషన్లు చేసుకుంటున్నారు.