Tollywood: కరోనా వైరస్ తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పేదవాడు మొదలుకొని సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి కష్ట సమయంలో ప్రభుత్వాలకు సెలబ్రిటీలు విరాళాలు ప్రకటిస్తూనే మరోపక్క సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక భారతదేశ ఆపద్బాంధవుడు.. ప్రభుత్వాల కంటే మించి మరి సహాయ కార్యక్రమాలు చేస్తున్న సోనూసూద్ గత ఏడాది నుండి.. చేస్తున్న కార్యక్రమాలను కొనసాగిస్తూ కరోనా సెకండ్ వేవ్ తీసుకొచ్చిన కష్టాలను తీర్చడానికి.. కరోనా రోగులకు.. ఆక్సిజన్ సిలిండర్లు అందించడానికి కొన్ని రాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి తేవటం తెలిసిందే.
ఇదే రీతిలో మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలలో జిల్లా కేంద్రాలలో ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేసి తన వంతు గా ప్రజలకు ఉపయోగపడుతున్నారు. పరిస్థితి ఇలా ఉండగా.. తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా దాదాపు వందమంది పేద కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. మేటర్ లోకి వెళ్తే కరోనా కారణంగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల పనులు లేక అవస్థలు పడుతున్న 100 మంది పేద కుటుంబాలకు దాదాపు నెల రోజుల పాటు సరిపడే సరుకులను అందించడం జరిగింది.
Read More: Tollywood: బ్లాక్ బస్టర్ అందుకున్న గాని ఆ టాప్ డైరెక్టర్ నీ వెంటాడుతున్న దురదృష్టం..!!
ఇంటిలో ప్రతి ఒక్కరూ తృప్తిగా భోంచేసే తరహాలో..నెలకు సరిపడే సరుకులను ప్యాకింగ్ చేసి.. పూజా హెగ్డే టీం పంపిణీ చేయడం జరిగింది. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పుకుని 100 మంది పేద కుటుంబాలకు సహాయం చెయ్యటంలో ఉన్న ఆనందం మాటల్లో వర్ణించ లేకపోతున్నా అని తన ఆనందాన్ని పూజా హెగ్డే నెటిజన్లతో పంచుకొంది.