Tomato Fever in Kerala: దాదాపు రెండు సంవత్సరాలు దేశం కరోనాతో అతలాకుతలం అయిపోయింది. 2019 నవంబర్ నెలలో చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ప్రపంచదేశాలను హడలెత్తించినది. కరోనా వైరస్ కారణంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోయాయి. దాదాపు అన్ని వ్యవస్థలు ఈ మహమ్మారి వల్ల డ్యామేజ్ అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో ఈ ఏడాది మార్చి ప్రారంభం నుండి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం తెలిసిందే. దీంతో చాలా వరకు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో.. ఎవరికి వారు మళ్ళీ తమ దైనందిన జీవితాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దేశంలో పెద్దగా కేసులు కూడా నమోదు కావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా కేరళలో కొత్త రకం వ్యాధి బయట పడింది. ఈ వ్యాధి వల్ల ఎక్కువగా 5 సంవత్సరాల లోపు పిల్లలు ఎఫెక్ట్ అవుతుండటంతో వాళ్ల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. కేరళ చిన్నారుల్లో బయటపడిన ఈ వ్యాధి టమాట ఫీవర్. దాదాపు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది చిన్నారులు లో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించారు. వ్యాధి బారిన పడిన చిన్నారి శరీరంపై టమాటా సైజుల్లో దద్దుర్లు, దురద, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు ఈ ఫీవర్ లో కనిపిస్తున్నాయి.
దీంతో కేరళ సరిహద్దుల వద్ద… వైద్య శాఖ అధికారులు భారీ ఎత్తున బర్డుఫ్లు లక్షణాలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహిస్తూ కేరళ ప్రభుత్వం టమాటో ఫీవర్ ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. దాదాపు దేశంలో కరోనా కేసులు మొదట కేరళ రాష్ట్రంలోనే వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ కొత్త వ్యాధి విషయంలో కేరళ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది.