మరి కొద్ది గంటల్లో ఐపీఎల్ – ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు తెరలేవనుంది. కరోనా సంక్షోభం కారణంగా మార్చి నుండి క్రికెట్ అనే పదమే లేక డీలా పడిపోయిన భారత్ క్రికెట్ ఫాన్స్ కి ఉత్సాహాన్ని ఇచ్చేందుకు ఐపీఎల్ ప్రారంభం అవుతుంది. ఈసారి ఐపిఎల్ దుబాయ్ లో జరగబోతుండడం అందరిలో ఆసక్తిని రెట్టింపు చేసేదే.
ఇకపోతే ఐపీఎల్ కోసం ఎప్పుడెప్పుడా అని మన బెట్టింగ్ రాయుళ్ళు ఎదురుచూస్తూ ఉన్నారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఇప్పుడు ట్రెండింగ్. అంతకు ముందు ఫోన్లు, లాప్ టాప్ లు, ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి ఆడే వారు తర్వాత లక్షల కోట్ల రూపాయల డబ్బు చేతులు మారింది. ఇప్పుడు తాజాగా అంతా డిజిటల్ మయమే. ఆన్లైన్ లోనే డబ్బులు లోడ్ చేసుకోవడం చేసుకోవడం…. విత్ డ్రా చేసుకోవడం. ఇలా ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే కొన్ని యాప్స్ కు లీగల్ బెట్టింగ్ కు అనుమతి ఉంది. డ్రీమ్11, bet365 బెట్టింగ్యాప్ లకు ఈ బెత్టింగ్ అనుమతి ఉంది కానీ మిగిలిన యాప్స్, సైట్స్ లో ఆన్లైన్లో బెట్ లు వేయడం అనేది చట్టరీత్యా విరుద్ధం. ఇక దేశంలో పలు రాష్ట్రాల్లో పాటు ఇతర దేశాలతో కూడా ఈ ముగ్గురికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జాతీయ బుకీలతో ఉన్న సంబంధాలపై పోలీసులు విచారణ జరుగుతుండగా మరికొద్ది గంటల్లో ఐపీఎల్ మొదలు కాబోతుంది కాబట్టి దేశవ్యాప్తంగా బుకీలంతా రంగంలోకి దిగారు.
ఇక ఈ ఆన్లైన్ బెట్టింగ్ దారుల మెయిన్ టార్గెట్ ఐపీఎల్ ప్రియులు. అందులోనూ యువకులు. వారిని వలవేసి పట్టుకునేందుకు తీవ్రస్థాయిలో సిద్ధమవుతున్నారు. ఇక పోలీసులు కూడా దానికి తగ్గట్టు వ్యూహాలు రచిస్తున్నారు అనుకోండి అది వేరే విషయం అయితే మొత్తానికి మళ్లీ క్రికెట్ పండుగ షురూ కానుంది అన్నమాట.