టాలీవుడ్ లో ఇప్పుడు రమ్యకృష్ణ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అత్తగా చేయాలన్నా అమ్మగా చేయాలన్నా ఆమెనే అందరూ మొదటి ఛాయిస్. రెండు దశాబ్దాలకు పైగా హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలో తన నటన తో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రమ్య కృష్ణ బాహుబలి సినిమాలో శివగామి పాత్ర ను ఆమె పోషించిన తీరు చూసి జాతీయస్థాయిలో సినీ ప్రేక్షకులంతా మంత్ర ముగ్ధులై పోయారు.
ప్రస్తుతం రమ్య కృష్ణ వయసు అక్షరాలా యాభై సంవత్సరాలు. అయినా ఆమె ఇప్పటికీ వన్నె తగ్గని గ్లామర్తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ వయసులో కూడా రమ్యకృష్ణ సినిమాల్లో నటించాలంటే ఆమె చేసే డిమాండ్ మామూలుగా లేదు. అసలు 50 ఏళ్ల వయసులో ఒక నటి ఇంత డిమాండ్ చేయడం ఇప్పటి వరకు ఎక్కడా లేదేమో. ఆమెతో సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేయించుకోవాలని పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్ కోసం త్రివిక్రమ్ రమ్యకృష్ణను సంప్రదించాడట
‘అయినను పోయిరావలె హస్తినకు ‘అనే టైటిల్ ఖరారు చేసుకున్నట్లు చెప్పబడుతున్న ఈ సినిమా లో రమ్యకృష్ణ కు కీలక పాత్ర వ్రాశాడట త్రివిక్రమ్. అత్తారింటికి దారేదిలో నదియా, అజ్ఞాతవాసి లో ఖుష్బూ, అల వైకుంఠపురం లో సినిమాలో టబు చాలా కీలకం అయితే అలా ఫుల్ లెన్త్ చేసేందుకు రమ్యకృష్ణ ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా త్రివిక్రమ్ డైలమాలో పడ్డాడు. అయితే రమ్యకృష్ణ అడిగినంత రేటు ఇచ్చి ఆమెను సినిమాలో త్రివిక్రమ్ పెట్టుకుంటాడా లేదా అనే విషయంపై ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు