ప్రపంచ దేశాలను భారీగా వణికిస్తున్న కరోనా వైరస్ మిగతా దేశాలతో పోలిస్తే అమెరికా, బ్రెజిల్ భారత్ ల పై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం భారత దేశంలో పరిస్థితి ఒక రకంగా మెరుగ్గా ఉంది. అయితే దానివల్ల కుదేలైపోయిన ఆర్థిక వ్యవస్థ తిరిగి లేవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో కరోనా వ్యాప్తిని కట్టడిచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగుతున్నారు.
ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విషయానికి వస్తే ఎంతో అత్యుత్సాహంతో ఎన్నికల కంటే ముందే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని…. తను ఎలాగైనా తెచ్చి తీరుతాను అని అతను చెప్పాడు. ఇప్పటికీ అదే మాట పదే పదే చెబుతున్నాడు. కానీ తాజాగా మోడర్నా సంస్థ చేసిన ప్రకటన అతని ఆశలపై నీళ్లు జరిగింది. ఇప్పటివరకు ప్రీ-క్లినికల్ ట్రయల్స్ అన్నింటిలో సత్ఫలితాలు సాధించిన ఈ సంస్థ ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. వ్యాక్సిన్ మోడర్నా సంస్థ సీఈవో స్టీఫెన్ బాన్సిల్ ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి నవంబర్ 25వ తేదీ వరకు సమయం పట్టవచ్చని ఆయన వెల్లడించారు. వ్యాక్సిన్ ఆశాజనకమైన ఫలితాలను సాధిస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. దీంతో ఎన్నికలు జరిగే నవంబర్ మూడవ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే కచ్చితంగా కనిపించడం లేదు. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ అన్ని సర్వేల్లో వెనకబడటం…. సమయానికి వ్యాక్సిన్ తీసుకొనివచ్చి ప్రజల్లో ఆదరణ సంపాదించాలన్న వ్యూహాం బెడిసికొట్టింది. ఇక ట్రంప్ సదరు కంపెనీలపై ఒత్తిడి తెచ్చి వ్యాక్సిన్ తెస్తారా అన్నది వేరే విషయం కానీ.. ప్రస్తుతం అమెరికాలో రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులు ఎన్నికల హడావిడి చూస్తుంటే ట్రంప్ గద్దె దిగడం ఖాయంగా అనిపిస్తుంది.