TTD: తిరుమల చేరుకున్న శ్రీవారి భక్తులకు వసతి గదుల కోసం ఇక్కట్లు తప్పవు.. వసతి గదుల కోసం ఎక్కువ సమయం క్యూ లైన్ లో పడిగాపులు కాయక తప్పదు.. ఈ విషయాన్ని గ్రహించిన టీటీడీ గదుల కేటాయింపు పై కీలక నిర్ణయం తీసుకుంది.. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం శనివారం ఉదయం 8 గంటల నుంచి తిరుమలలోని ఆరు ప్రాంతాలలో కొత్త కౌంటర్లను ఏర్పాటు చేసింది.. ఈ కౌంటర్లలో వసతి గదుల కోసం పేర్లు నమోదు చేసే అవకాశాన్ని టిటిడి కల్పిస్తుంది..
Read More: Today gold rate: మహిళలకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు..
కొత్తగా ఎంబిసి ప్రాంతంలోని శ్రీవారి మెట్లు వద్ద, బాలాజీ మెయిన్ బస్టాండ్, కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో, రాంభగీచ బస్టాండ్ సమీపంలో, జిఎన్ సి టోల్గేట్ సమీపంలోని లగేజ్ కౌంటర్ వద్ద, సిఆర్వో వద్ద 2 కౌంటర్లలో భక్తులు వసతి కోసం పేరు నమోదు చేసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులు వారి సౌకర్యార్థం దగ్గరలోని కౌంటర్లో పేరు నమోదు చేసుకున్న భక్తులకు ఎస్ఎంఎస్ ద్వారా కేటాయించిన గదుల వివరాలు తెలియజేస్తారు. కేటాయించిన ప్రాంతాలలో ఉప విచారణ కార్యాలయాల వద్ద రుసుం చెల్లించి గదులు పొందవచ్చు. ఈ ఏర్పాట్ల వల్ల వసతి కోసం ఇబ్బందులు పడుతున్న భక్తుల కోసం టిటిడి సులభతరం చేసింది..