Tuberculosis: ఎక్కువ రోజుల నుంచి దగ్గు వస్తుందా..!! అయితే ఆలస్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోండి..!! రెండు లేదా మూడు వారాలకు మించి దగ్గు వస్తుంటే అది క్షయ వ్యాధికి సంకేతం..!! మైకోబాక్టీరియం ట్యూబరంక్యులోసిస్ బ్యాక్టీరియా వలన వచ్చే అంటువ్యాధి.. ఈ క్షయ క్రిములు ముఖ్యంగా ఊపిరితిత్తులలో ప్రవేశించి శ్వాసకోస వ్యాధిని కలగజేస్తాయి.. ఈ శ్వాసకోశ క్షయ చాలా తీవ్రమైన అంటువ్యాధి శరీరంలోని ఇతర భాగాలకు కూడా క్షయ వ్యాధి వచ్చే అవకాశం లేకపోలేదు.. పోషకాహార లోపం వలన కూడా ఈ వ్యాధి వస్తుంది.. భయంకరమైన అంటువ్యాధి అయినా టీబీ దేశంలో ప్రతి సెకనుకి ఒకరికి సోకుతుంది.. ప్రతి రోజు 1000 మంది క్షయ వ్యాధితో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది..!! టీబీ వ్యాధికి సరైన ఆహారం, మందులు తీసుకుంటే చెక్ పెట్టవచ్చు..!! తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన నియమాలు గురించి తెలుసుకుందాం..!!
Tuberculosis: ఈ జ్యూసులతో టీబీ కి చెక్ పెట్టవచ్చు..!!
పోషకాలు, క్యాలరీలు అధికంగా ఉన్న ఆహారాలు క్షయ రోగి పెరుగుతున్న జీవక్రియ డిమాండ్లను తీరుస్తాయి. అలాగే బరువు తగ్గకుండా కూడా చేస్తాయి. తృణధాన్యాలు అన్నిటి నుంచి తీసుకున్న గంజి ఎక్కువగా తీసుకోవాలి. అరటిపండు, వేరుశనగ చిక్కి, గోధుమ, రాగి వంటి ఆహార పదార్థాలు టీబీ రోగులకు ఎంతో మేలు చేస్తాయి వీటితోపాటు పచ్చి కూరగాయల రసాలని ఎక్కువగా తీసుకోవాలి. ఇది టీబీ ని తగ్గించడంతో పాటు రక్తాన్ని కూడా శుద్ధి చేస్తాయి.. నారింజ, మామిడి, తీపి గుమ్మడి, క్యారెట్, జామ, ఉసిరి, టమాటా, విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉన్న పదార్థాలు వీరి డైట్ లో భాగం చేసుకోవాలి.. జింక్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని వీరు తీసుకోవాలి. పొద్దుతిరుగుడు విత్తనాలు, చియా విత్తనాలు, గుమ్మడికాయ గింజలు, అవిశ గింజలు టీబీ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. టీబీ వ్యాధులను ఎదుర్కొనడంలో ఇవి సహాయపడతాయి..
Tuberculosis: క్షయ రోగులు పాటించాల్సిన నియమాలు..!!
క్షయ క్రిములు గాలి ద్వారా వ్యాపిస్తాయి. టీబి వ్యాధితో బాధపడేవారు దగ్గినప్పుడు అతని ఊపిరితిత్తుల నుంచి వచ్చే కఫం ద్వారా ఈ బ్యాక్టీరియా గాలిలోకి చేరి దగ్గరలో ఉన్న ఆరోగ్యవంతమైన మనిషి పీల్చే గాలి తో పాటు అతని ఊపిరితిత్తులలో ప్రవేశించి ఈ వ్యాధి సోకేలా చేస్తుంది. అందుకని క్షయరోగి దగ్గినప్పుడు నోటికి అడ్డం పెట్టుకోవాలి. దగ్గినపుడు వచ్చే కఫం ఒక పాత్రలోనికి పట్టి కాల్చివేయాలి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకుండా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిరోధక చర్యగా చిన్న పిల్లలకి బి.సి. జి టీకా వేయించాలి. వ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తికి వెంటనే కఫం పరీక్ష చేయించాలి. ఎక్కువ రోజుల నుంచి దగ్గుతో ఇబ్బంది పడుతున్నా, కఫం వచ్చినట్లు జ్వరంతో బాధపడుతున్న, దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే ఈ వ్యాధి మొదటిలోనే అంతం చేయవచ్చు.
తృణధాన్యాలు, గింజలు, విత్తనాలు, చేపలు, చికెన్ లో విటమిన్ బి కాంప్లెక్స్ అధికం గా ఉంటుంది. టీబీ రోగులు వీటిని తక్కువగా తీసుకోవాలి.