Ukraine Russia War: గత నెల రోజుల నుండి రష్యా బలగాలు ఉక్రెయిన్ లో బాంబుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ఉక్రెయిన్ ప్రజలు దేశం విడిచి వెళ్లి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఇదే సమయంలో రష్యా మిలటరీ బలగాలు ఉక్రెయిన్ లో ప్రధాన నగరాల నుంచి.. పాఠశాలలు మరియు హాస్పిటల్స్ అదేవిధంగా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు చేస్తూ ఉండటంతో.. ఉక్రెయిన్ అస్తవ్యస్తంగా మారింది. ఏకంగా ఇటీవల డ్రామా థియేటర్ పై రష్యా బాంబు దాడులకు పాల్పడటంతో.. అందులో తలదాచుకున్న 1300 మందిలో 300 మంది దుర్మరణం చెందారు అని.. ఉక్రెయిన్ అధికారులు స్పష్టం చేశారు.
దీంతో రెండు దేశాలు యుద్ధం కారణంగా ఎక్కువగా ఉక్రెయిన్ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు ఆహారం లేక అలమటించి పోతున్నారు. ఇక ఇదే సమయంలో బాంబుల దాడిలో చనిపోయిన శవాలను తీసుకెళ్లే వారు కూడా లేకపోవడంతో… మారియు పోల్ లో సామూహిక ఖననాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది శిథిలాల మధ్య తమ వారు ఉన్నారేమో అని వెతుకుతున్న వారు కూడా ఉన్నారు. ఈ రీతిలో రష్యా మిలటరీ విద్వాంస దాడులు చేస్తూ ఉన్న సమయంలో.. ఉక్రెయిన్ ఆర్మీ ఊహించని షాక్ ఇటీవల ఇవ్వడం జరిగింది.
మేటర్ లోకి వెళ్తే ఉక్రెయిన్ ఆర్మీ రష్యాకు చెందిన కీలక సైనిక అధికారులను ఐదుగురిని టార్గెట్ చేసి మరీ చంపింది. దీనిని ధ్రువీకరిస్తూ నల్ల సముద్రం నౌకాదళానికి చెందిన అధికారులు.. తెలియజేయగా రష్యా కూడా ఒప్పుకోవడం జరిగింది. కాగా మరోపక్క రెండు దేశాల మధ్య దఫాలుగా జరుగుతున్న చర్చలు సఫలం కాకపోవడంతో .. యుద్ధం మరింత ఉధృతమయ్యే పరిస్థితి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ రష్యాలో సొంత ప్రజలు అధ్యక్షుడు పుతిన్ వ్యవహరిస్తున్న తీరుపై భారీగా వ్యతిరేకత చాటుతున్నట్లు దీంతో పుతిన్ యుద్ధం విషయంలో వెనకడుగు వేసే ఆలోచన చేస్తున్నట్లు.. అంతర్జాతీయంగా వార్తలు రీసెంట్ గా వినిపిస్తున్నాయి.