సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు నుంచి దాదాపు రెండు సంవత్సరాల వయసు వచ్చే వరకు పిల్లలు పగటి సమయంలో ఎక్కువ సమయం నిద్రకే కేటాయిస్తారు. అలా నిద్రపోవడం వల్ల వారిలో ఏవైనా సమస్యలు ఉన్నాయేమో అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అయితే పిల్లలు ఎలా నిద్ర పోవడం మంచిదేనా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే పసిపిల్లలు ఎందుకు ఎక్కువ సేపు నిద్రపోతూ ఉంటారు.. అలా నిద్రపోవడం వల్ల ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం…
ఈ గత రెండు సంవత్సరాల కాలంలో పిల్లలు ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉంటారు. ఈ ట్రాన్స్లేషన్ పీరియడ్ కేవలం మనుషుల లోనే కాకుండా అన్ని రకాల జంతువుల పిల్లలలో కూడా జరుగుతుంది. ఈ పీరియడ్ లో మెదడు పెరుగుదల, నాడుల అమరిక జరుగుతూ ఉంటుంది. అందువల్ల పిల్లలు ఎక్కువ సేపు నిద్ర పోతూ ఉంటారు. నిద్ర లేకుండా ఉండే వారిలో మెదడు పెరుగుదల సరిగా జరగకపోవడంతో అలాంటి పిల్లలో అవగాహన సామర్థ్యం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే పిల్లలను వీలైనంతవరకు పడుకో పెట్టడానికి ప్రయత్నించండి.
తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై పడుతుందనీ మనకు తెలుసు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఏవైనా కారణాల చేత గొడవలు పడి విడిపోతే, ఆ ప్రభావం పిల్లలపై పడుతుందని, అందుకు గల కారణం వారిలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ తగ్గిపోవడమేనని, బేలర్ విశ్వవిద్యాలయ నిపుణులు చెబుతున్నారు. ఆక్సిటోసిన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల వారు పెద్దయ్యాక కూడా ఎవరి మీద ప్రేమను వ్యక్తపరిచలేక పోతున్నారని, ఈ అధ్యయనాల్లో తేలింది. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లలు ముందు గొడవ పడకుండా, వారిని ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో పెంచటం వల్ల వారిలో మానసిక ఉల్లాసంతో పాటు మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.