కరోనా ప్రభావం మూవీ ఆర్టిస్టులు, సింగర్ లను దాటి ఇప్పుడు సీరియల్స్ పైన భారీగా పడింది. షూటింగ్ లో పాల్గొంటున్న చాలా మంది నటీనటులు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొద్ది మంది అయితే భయంతో సీరియల్స్ మానుకున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇదే క్రమంలో తెలుగు లో వచ్చే ‘వదినమ్మ’ సీరియల్ లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివ పార్వతి కి కరోనా సోకింది. అయితే ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నది…. తాను ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనతో కలిసి ప్రయాణం చేస్తున్న వారు ఎలాంటి వారు… అన్న విషయాలను తాను తెలుసుకున్నట్లు…. శివపార్వతి ఇలా చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా నటుడు, ప్రొడ్యూసర్, బుల్లితెర మెగాస్టార్ అని పిలవబడే ప్రభాకర్ పై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వదినమ్మ సీరియల్ షూటింగ్ సమయంలో ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని…. అయితే తాను ఆసుపత్రిలో పది రోజులు ఉండి చావు అంచుల దాకా వెళ్లి వచ్చిన తర్వాత కూడా అసలు తాను ఎలా ఉన్నాను అన్నది కనీసం ఎవరూ పట్టించుకోలేదని ఆమె వాపోయింది.
అతని సీరియల్ లో నటించినందు వల్లే నాకు కరోనా సోకి పరిస్థితి ఇంత విషమంగా తయారయింది అని చెప్పిన ఆమె…. సీరియల్ జరుగుతున్నప్పుడు తనకు పాజిటివ్ వచ్చి ఆస్పత్రిలో చేరిన తర్వాత కూడా ఆమెను చూడడానికి యూనిట్ నుండి ఒక్కరు కూడా రాలేదని కనీసం బాగోగులు కూడా విచారించలేదని అన్నారు.
ఆమె సినిమాలు మానేసి ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా జీవిత రాజశేఖర్ గారు వచ్చి ఆమెను పరామర్శించేవారని శివ పార్వతి చెప్పారు. ఇక యూనిట్ నుండి ఇన్సూరెన్స్ డబ్బు వచ్చే అవకాశం ఉన్నా కూడా కనీసం అది అందే పరిస్థితి కూడా ఆమెకు లేదని ఆమె అన్నారు. తాను ఎవరినీ నిందించి లాభం లేదని… కేవలం థ్యాంక్స్ మాత్రమే చెబుతున్నానని అన్న ఆమె…. తనకు పరిస్థితి రావడం వల్ల ఈ పరిస్థితిని కల్పించిన ప్రభాకర్ గారికి థ్యాంక్స్ చెబుతూ…. తనకు మనుషులు ఎలా ఉంటారో వారితో మనం ఎలా నడుచుకోవాలి అన్న విషయం ఇప్పుడు అర్థం అయిందని ఆమె అన్నారు.