After Meal: పోషకాలతో కూడిన ఆహారంతో పాటు ఆహారపు అలవాట్లు కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి.. భోజనం చేసేటప్పుడు కంటికి నచ్చిన ఆహారాలన్నింటిని తింటే.. ఆ తరువాత జీర్ణ సమస్యలను ఎదుర్కోవాలి.. దీనికోసం మార్కెట్లో దొరికే మందులను వాడితే వాటితోపాటు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.. అలా అని తినకుండా ఉండలేము.. భోజనం చేసిన తర్వాత ఇందులో చిట్కాలలో పాటిస్తే మీ ఆరోగ్యానికి డోకా ఉండదు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు..!!
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వజ్రాసనం వేయాలి. ఈ ఆసనం మన శరీరం లో ఒత్తిడిని కలిగిస్తుంది ఈ ఆసనం యొక్క భంగిమ పొత్తికడుపు పొట్ట పేగులు మీద ఒత్తిడి కలిగిస్తూ జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. దాంతో మలబద్ధకం ను నివారిస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడే వారు రోజు భోజనం చేసిన తరువాత ఈ ఆసనం మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఇంకా బరువు తగ్గుతారు.
ఇక రెండవది మధ్యాహ్న భోజనంతో మజ్జిగ తీసుకోండి. మనకి చక్కటి జీర్ణశక్తి కావాలంటే మజ్జిగ తాగడం తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి కడుపును చల్లగా ఉంచుతాయి. అసిడిటీ లక్షణాల నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. రాత్రి భోజనం లో పెరుగు తినకూడదని అందరికీ తెలిసిందే. అందువలన రాత్రి భోజనంలో కూడా మజ్జిగ తీసుకోండి. మీ జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. తద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?