ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దురాశ దుఃఖానికి చేటు అనే నానుడి మనకి తెలిసినదే. అత్యాశపడి ఏదైనా సంపాదించడం వల్ల దాని కోల్పోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దురాశ ఉండడం వల్ల ఎలాంటి పరిస్థితి కలుగుతుందో ఈ దోమను చూస్తే అర్థం అయిపోతుంది. సాధారణంగా దోమలకు మనుషుల రక్తం అంటే ఇష్టం. మనుషుల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తాయి. అలానే ఒక దోమ మనిషి రక్తాన్ని దాని స్థాయికి మించి తాగడం వల్ల పొట్ట పగిలి చచ్చింది.
మనుషుల రక్తం అంటే దోమలకు ఎంతో ఇష్టం. ఎన్నో రకాల వ్యాధులను వ్యాపించే భయంకరమైన వైరస్ లను తనతో మోస్తూ మనుషులను కుట్టడం ద్వారా ఆ వైరస్ మన శరీరంలో పంపించడమే కాకుండా, మనలో ఉన్న రక్తాన్ని పీల్చే చేస్తాయి. అలా దోమలు కుట్టడం వల్ల ఎన్నో రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. కొన్నిసార్లు ఆ భయంకరమైన వ్యాధుల తీవ్రత అధికమవడం వల్ల మరణం కూడా సంభవిస్తుంది. అందువల్ల దోమల నుండి వీలైనంత వరకు మనం రక్షణ పొందుతూ ఉంటాము.
కీటకాల అధ్యయన శాస్త్రవేత్త అయిన డాక్టర్ పెరాన్ రాస్ దోమల మీద అధ్యయనంలో భాగంగా ఎన్నో దోమలతో కుట్టించుకుంటూ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దోమలపై అధ్యయనం చేస్తున్నారు. ఒకటి కాదు ,రెండు కాదు ఏకంగా ఐదు వేలకు పైగా దోమలతో కుట్టించుకొని అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో పెరానా రాస్ తన అధ్యయనంలో ఒక వింత దోమను గమనించాడు.
ఒక దోమ అతనిపై వాలి ఎంతో ఆశతో దాని కడుపు నిండా రక్తం పీల్చేసింది. చివరికి పొట్ట పగిలి ఆ దోమ చనిపోయింది. ఈ వీడియోని పెరాన్ రాస్ తన ట్విట్టర్ లో ద్వారా పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో దోమ రక్తం తాగి పొట్ట పగిలి సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. రాస్ ఇలాంటి ఆశ్చర్యకరమైన వీడియోలను తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ప్రస్తుతం రక్తం తాగి పొట్ట పగిలిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.
By popular demand, here's a shorter version of the exploding mosquitoes video pic.twitter.com/nRMiycFKqH
— Perran Ross (@MosWhisperer) March 24, 2020