RRR: “ఆర్ఆర్ఆర్” ఎట్టకేలకు అనేక అడ్డంకులు ఎదుర్కొని మార్చి 25 వ తారీకు విడుదల అయ్యి భారీ విజయం సాధించడం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని.. వరుసపెట్టి రికార్డులు క్రియేట్ చేస్తోంది. రాజమౌళి టేకింగ్ కి ప్రతి ఒక్కరు సెల్యూట్ చేస్తున్నారు. ఇక చరణ్, తారక్ ఇద్దరికిద్దరూ కుమ్మేశారు అని అంటున్నారు. ప్రజెంట్ “ఆర్ఆర్ఆర్” రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొడుతోంది. 400 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలోనే 700 కోట్లకు పైగా కలెక్షన్ లు సాధించినట్లు బయట వార్తలు వస్తున్నాయి. సినిమా విజయంతో సినిమా ఫుల్ హ్యాపీగా ఉంది.
ఇటువంటి తరుణంలో ప్రస్తుతం సినిమా రిలీజయ్యాక పాజిటివ్ టాక్ వచ్చాక ఎక్కువగా స్టోరీ రైటర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సోషల్ మీడియాలో అనేక ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. సినిమాకి సంబంధించి కొత్త విషయాలు తెలియ జేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ సోషల్ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో “ఆర్ఆర్ఆర్” స్టోరీస్ డిస్కషన్ జరుగుతున్న సమయంలో చరణ్ కంటే ముందు ఓ మెగా హీరో ని రాజమౌళి అనుకున్నట్లు సరికొత్త విషయాన్ని బయటపెట్టారు.
“ఆర్ఆర్ఆర్” స్క్రిప్ట్ స్టేజ్ ఉన్న సమయంలో.. హీరోల గురించి డిస్కషన్ జరుగుతున్న తరుణంలో… మొదట రాజమౌళి పవన్ కళ్యాణ్ అని భావించారు. కానీ ఆయన కున్న క్రేజ్ సరి సమానంగా వేరే హీరోని పోల్చుకునే పరిస్థితి ఎక్కడా కనబడలేదు. దీంతో ఆయన కు మ్యాచ్ అయ్యే హీరో లేకపోవడంతో.. రాజమౌళి… చరణ్, ఎన్టీఆర్ లతో ప్రొసీడ్ అయిపోయారు అన్న విషయాన్ని బయటపెట్టారు. అంతమాత్రమే కాదు తాను తీసిన బాహుబలి సెకండ్ పార్ట్ లో ఇంటర్వెల్ సీన్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి దృష్టిలో పెట్టుకుని రాయటం జరిగింది అని.. ఆయన పై తనకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని విజయేంద్రప్రసాద్ తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు.