Viral Photo : వరంగల్ జిల్లాలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది.. శునకం ఎడ్లబండిపై సవారీ చేస్తూ చూపరులను ఆశ్చర్యానికి గురి చేసింది.. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా తిమ్మాపురం లో చోటు చేసుకుంది. ఓ రైతు పొలానికి వెళ్లేందుకు ఎడ్లబండిని సిద్ధం చేసుకున్నాడు.. అయితే ఆ రైతు లేకుండానే శునకం ఎడ్ల బండి ఎక్కింది.. ఎంచక్కా ఎడ్లబండిపై దర్జాగా సవారీ చేస్తూ షికారు కొట్టింది.. శునకం రాజభోగం అనుభవిస్తున్న ఈ దృశ్యం అందరిని ఆకర్షిస్తుంది. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది..