Viral Photo: సినీరంగంలో అడుగుపెట్టాలనుకునే వారందరికీ మొదటి ఆదర్శం చిరంజీవి.. సినిమా పరిశ్రమలో ఆయనలా ఎదగాలని లక్ష్యం పెట్టుకుని కష్టపడుతున్న స్టార్ హీరోలందరో.. అలాంటి మెగాస్టార్ చిరంజీవి పక్కన కూర్చున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది..
ఇంతకీ ఈ ఫోటోలో కనిపిస్తున్న పిల్లాడు ఎవరో గుర్తుపట్టారా.. ఈ ఫోటోలు చిరంజీవి పక్కన కూర్చున్నది ఎవరో కాదు చిరంజీవి మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. ఈ త్రో బ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. చిరంజీవి మేనల్లుడు గా సినీరంగ ప్రవేశం చేసిన సాయి ధరమ్ తేజ్ కథల ఎంపిక విషయంలో ప్రతి సినిమాకి వైవిద్యం చూపిస్తూ, నటుడిగా తనను తాను నిరూపించుకుంటూ సుప్రీమ్ హీరోగా ఎదిగాడు.. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సాయి ధరంతేజ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు..
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమాలు లో హీరోగా నటిస్తున్నాడు.. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో రానుంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాకుండా జగపతి బాబు కూడా ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..