దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తన కూతురు షర్మిల ని మహారాణిలా చూసుకునేవారు అని వైఎస్ విజయమ్మ ఆమె రచించిన రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ‘నాలో వైఎస్ఆర్ నాతో వైఎస్ఆర్’ లో పేర్కొన్నారు. 1994లో ఒక ఫ్రెండ్ ద్వారా అనిల్ ను షర్మిలా కలిసింది అని అంతేకాకుండా అనిల్ కు వైయస్సార్ అంటే చాలా అభిమానం అని చెప్పుకొచ్చింది. నాన్న అంటే ఎంతో ఇష్టం ఉన్న అనిల్ ను కలిసినందుకు కూడా షర్మిల చాలా సంతోషపడింది అని.. ఇక ఇరువురి మధ్య స్నేహం తర్వాత ప్రేమగా మారింది అని విజయమ్మ చెప్పారు. ఇకపోతే 1996లో ఓ రోజు రాత్రి భోజనం చేసే సమయంలో తన ప్రేమ వ్యవహారం రాజశేఖర్ రెడ్డికి చెప్పిందట షర్మిల.
ముందు విజయమ్మకు చాలా కోపం వచ్చిందట. రాజశేఖర్ రెడ్డి మాత్రం మొత్తం శాంతంగా విని వారి సంప్రదాయాలు వేరు మన సంప్రదాయాలు వేరు…. వారి పద్ధతులు వేరు మన పద్ధతులు వేరు అని ఆమెకి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు కానీ వినలేదు. ఇద్దరి మధ్య చాలా రోజులు మాటలు లేవు. వాళ్లని చూసి నేను ఏడుస్తూ కూర్చునేదాన్ని అని విజయమ్మ అప్పటి సంగతులను గుర్తుచేసుకున్నారు. షర్మిల కూడా అటు తండ్రిని.. ఇటు తన ప్రేమను వదులుకోలేక బాగా నలిగిపోయింది అని విజయమ్మ చెప్పింది. ఎవరో కొంతమంది స్నేహితులు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ప్రెస్ ముందుకు వెళ్ళమని చెప్పినా షర్మిల అందుకు ఒప్పుకోలేదట.
అయితే అలా ఏడాది గడిచిన తర్వాత షర్మిలకు తన చిన్న తమ్ముడు చందుని ఇచ్చి వివాహం చేయాలని విజయమ్మ భావిస్తే షర్మిల కూడా ఇష్టంగానే అంగీకరించింది…. కానీ ఆ తర్వాత కాపరానికి మాత్రం వెళ్లలేదు. ఆమె మెండితనం చూసి చందుకి షార్మిలతో విడాకులు ఇప్పించి అతనికి పెళ్లి చేశాం అని విజయమ్మ చెప్పారు. ఆ తర్వాత షర్మిల అమెరికాకు వెళ్లి వచ్చింది. ఇక 1999 లో వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి అనిల్ ని పెళ్ళాడనని చెప్పింది షర్మిల. అది ఇక నీకు సంతోషం అయితే నాకు సంతోషమే అని వైఎస్ చెప్పాడట. ఇద్దరినీ చూడాలని ఉంది వెంటనే ఇండియాకు వచ్చేయండి అని చెప్పిన రాజశేఖర్ రెడ్డి అనిల్ ను ఆహ్వానించిన తీరు మాత్రం అద్భుతం అని చెప్పింది. అయితే ఒక మూడు సంవత్సరాలు మాత్రం ఈ వ్యవహారం వల్ల జీవితానికి సరిపడా నరకాన్ని అనుభవించామని విజయమ్మ చెప్పడం గమనార్హం.