Modi : ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ కి విరుగుడు వ్యాక్సిన్ చాలా దేశాలలో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ప్రపంచంలో అన్ని దేశాలలో కంటే భారత్ ముందంజలో ఉంది. దేశంలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరుగుతూ ఉండటంతో ప్రపంచ దేశాలు కరోనా పట్ల భారత్ అవలంబిస్తున్న విధానంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. పైగా భారత్ వ్యాక్సిన్ చాలా సమర్థవంతంగా పని చేయడంతో చాలా దేశాలు ..భారత వ్యాక్సిన్ తమ దేశాల్లో కి దిగుమతి చేసుకోవడానికి ఇప్పటికే అనేక ఆర్డర్లు చేస్తున్నాయి.
మరోపక్క భారత్ ప్రభుత్వం ప్రపంచంలో ఉండే పేద దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల వెస్టిండీస్ దేశానికి భారీ స్థాయిలో కరోనా వ్యాక్సిన్ డోసులు పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ .. భారత్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. ప్రధాని మోడీ అదేవిధంగా భారత ప్రభుత్వం మరియు భారతీయులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
కీలకమైన సమయంలో సహాయం చేసినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, త్వరలోనే ఇండియాలో అడుగు పెట్టబోతున్నట్లు, అందరినీ కలవబోతున్నట్లు క్రిస్ గేల్ ఇండియా ఫై తనకి ఉన్నఅభిమానాన్ని చాటాడు. ఒక్క జమైకా దేశానికి మాత్రమే కాక పక్క శత్రుదేశం పాకిస్తాన్ దేశానికి కూడా ఇండియా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపించడం జరిగింది. ప్రపంచంలోనే ఎక్కువ వ్యాక్సినేషన్ పంపిణీ చేసే దేశంగా ఇండియా రికార్డు సృష్టిస్తోంది. స్వదేశానికి మాత్రమే గాక ఇతర దేశాలకు కూడా సహాయం చేస్తూ ఉండటం తో కరోనా యుద్ధంలో కీలకమైంది భారత్ అంటూ అంతర్జాతీయ మీడియా కూడా ప్రశంసల వర్షం కురిపిస్తోంది.