టాలీవుడ్ సింగర్ యాక్టర్ నోయల్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. ‘కుమారి 21 ఎఫ్’ సినిమా లో విలన్ పాత్రలో నటించిన నోయల్, ‘ఈగ’ వంటి అడపాదడపా సినిమాల్లో ప్రేక్షకులను అలరించాడు. ‘భీమవరం బుల్లోడు’, ‘జయ జానకి నాయక’, ‘జూలియట్’ ‘లవ్ అఫ్ ఇడియట్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ఎస్తేర్. గతేడాది వీరిరువురూ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
రెండు కుటుంబాలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య మనస్పర్థలు వచ్చాయని…. గత కొంతకాలంగా కలిసి ఉండటం లేదని వార్తలు వచ్చాయి. అయితే అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి కనిపిస్తూ అది తప్పు అన్నట్లు ఉన్నారు. ఇకపోతే తమ వైవాహిక బంధానికి సెలవు చెబుతున్నట్లు వారు అధికారికంగా వెల్లడించారు. తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. గత ఏడాది జూన్ లో విడాకుల కోసం అప్లై చేయగా దరఖాస్తులని పరిశీలిస్తున్న కోర్టు నిర్ణయం కోసం వారు ఇన్నాళ్ళు ఎదురుచూశారు.
అంతేకాకుండా అభిప్రాయ భేదాల కారణంగా తమ విడిపోతున్నాం అని…. తమ మధ్య ఉన్న అందమైన బంధాన్ని…. విలువని కాపాడుకునేందుకు ఇదే సరైన నిర్ణయం అని వారు భావిస్తున్నట్లు తెలిపారు. ఇక నోయల్.. ఎస్తేర్ భవిష్యత్తు బాగుండాలని…. తనకు అంతా మంచే జరగాలని తను కలలు కన్న జీవితం తనకి లభించాలని చెప్పాడు. విడాకుల విషయంలో ఎస్తేఱ్ ని ఎలాంటి ఇబ్బంది పెట్టవద్దని అతను ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు. ఇలాంటి సమయంలో తమకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు, ఎస్తేర్ కూడా దీనిపై ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.