కరోనా కష్టకాలంలో ప్రభుత్వం నుండి ఏ రూపంలో అందినసహాయమైనా విలువైనదే, అన్న విషయం మనందరికి తెలుసు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లబ్ధిదారులకుజన్ ధన్ ఖాతాదారులు, రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి కరోనా కష్టకాలంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రూపాల్లో సహాయం అందిస్తున్నాయి. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి రూ. 1500 వారి ఖాతాలో డిపాజిట్ చేసింది .అయితే రేషన్ తీసుకొని వారికి ఈ విషయంలో గట్టి దెబ్బ తగిలింది. వారికిప్రభుత్వం అందించిన ఆ ప్రయోజనాలు అందలేదు. ఈ కారణంగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్నఒక కీలక నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తాజాగా మీడియాకు వెల్లడించారు. అదేంటంటే, రేషన్ కార్డు ఉంటే చాలు మూడు నెలలపాటు రేషన్ తీసుకోకపోయినా రూ.1500 డిపాజిట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
వరుసగా మూడు నెలలపాటు రేషన్ తీసుకోకుండా, ఏప్రిల్ నెలలో రేషన్ తీసుకున్న లబ్ధిదారులకు,తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ మే నెల కు సంబంధించిన రూ.1500 నగదును వారి ఖాతాలో జమ చేసిందిఅని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ ప్రకటించారు. వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోకుండా ఏప్రిల్ నెలలో రేషన్ తీసుకున్న రెండు లక్షల8 వేల మందికి ఏప్రిల్, మే రెండు నెలలు కలిపి ఒక్కొక్కరికి రూ3000 చొప్పున మొత్తం రూ రూ 62 కోట్ల40 లక్షల రూపాయలను వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. లబ్ధి దారులు భౌతిక దూరాన్ని పాటించి నగదును తీసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.