Curd: పాల నుంచి పెరుగు తయారు అవుతుంది.. పెరుగులో విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి.. ప్రతి రోజు పెరుగు ని అని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉంటారు.. కొంతమందికి పెరుగుతో అన్నం తినకపోతే భోజనం చేసిన సంతృప్తి కలగదు.. నిత్యం పెరుగును తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలను రాకుండా చేస్తుంది.. అయితే ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు పెరుగును తినకూడదు.. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..!!
Curd: పెరుగు తింటే బరువు పెరుగుతారా..!?
కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు పెరుగును తినకూడదు. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ కీళ్ల నొప్పులను తీవ్రం చేస్తుంది. ఆర్థరైటిస్ తో బాధపడుతున్న వారు సాధ్యమైనంత వరకూ పెరుగు కి దూరంగా ఒకవేళ మీరు పెరుగుని తినాలి. అనుకుంటే వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ తినాలి. ఆర్థరైటిస్ ఉన్న వారు పెరుగును తీసుకుంటే కీళ్ల నొప్పులు ఇంకా ఎక్కువగా బాధిస్తాయి.
ఆహారం తీసుకుంటే త్వరగా జీర్ణం కాని వారు, మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు, ఉదర సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా పెరుగును తీసుకోకూడదు. బలహీనమైన జీర్ణ వ్యవస్థ ఉన్న వారు రాత్రిపూట పెరుగు తినకూడదు. అసిడిటీ , అజీర్తి, గ్యాస్ జీర్ణక్రియ మందగించడం వారు కూడా పెరుగును తినకూడదు. సమస్యలన్నీ రాత్రిపూట తీసుకున్న ఆహారం ద్వారానే ఉత్పన్నమవుతాయి. అందుకని ఈ సమస్యతో బాధపడుతున్నవారు రాత్రిపూట పెరుగు ను నిషేధించండి. సాధారణ సాధారణంగా కూడా రాత్రిపూట పెరుగును తినకూడదు. దీని వలన అజీర్తి, గ్యాస్ ఫార్మ్ అవుతుంది. పెరుగు తినే అలవాటు ఉన్నవారు రాత్రిపూట మజ్జిగ తీసుకోండి.
పెరుగు తింటే బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే ఎక్కువగా పెరుగును తీసుకుంటే ఊబకాయానికి దారితీస్తుంది. బరువు తగ్గాలని ప్రయత్నం చేస్తున్నవారు ఫ్యాట్ లేని పెరుగు ను ఎంచుకోవాలి. వీరు పెరుగు ను రోజు మొత్తంలో ఒక సారి మాత్రమే తీసుకోవాలి. రాత్రిపూట అస్సలు తీసుకోకూడదు. వీలున్నప్పుడల్లా పలచటి మజ్జిగను చేసుకుని తాగండి.